HUB GOIAS : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ల అభివృద్ధికి మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వా మ్యానికి టీ హబ్ (T-Hub), బ్రెజిల్ లోని గోయస్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హబ్ గోయస్ (HUB GOIAS)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, హెచ్ఐ సీసీలో హబ్ గోయస్ (HUB GOI AS) ప్రతినిధులతో చర్చలు జరిపా రు. అనంతరం T-Hub పౌండేషన్ సీఈవో సుజిత్ జాగిర్దార్, బ్రెజిల్ దేశ గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్ లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి.
ప్రధానంగా ఆర్టిఫీషియ ల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారం పంచుకుంటాయి. మార్కెట్ యా క్సెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగ స్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై టీ-హబ్ (T-Hub), హబ్ గోయస్ (HUB GOIAS) కలిసి పని చేస్తా యి. రెండు దేశాల స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుంది.