Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HYD ATTACKS : భాగ్యనగరంలో కాల్పుల కలకలం, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద హైడ్రామా

HYD ATTACKS : ప్రజా దీవెన, హైదరాబాద్: భాగ్యన గరంలో కాల్పుల కలకలం చెలరేగిం ది. దీంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యా పారి ఇంటి వద్ద హైడ్రామా నడి చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద ఇరువర్గాల ఘర్షణ పడి ఏకంగా పరస్పరoగా కాల్పులకు దిగడంతో కాసేపు భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పు లు జరిపినట్లు ఆధారాలు లభించ లేదన్న సమాచారం తెలిసింది.

ఇరువర్గాల్లో ఎవరూ ఫిర్యాదులు చేయలేదని పోలీసులు వెల్లడిం చడంతో విచారణ జరిపి ఘర్షణలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసు కుంటామన్న పోలీస్ అధికారి బా లకృష్ణ తెలిపారు. సంఘటన కథా కమిషు భూ వివాదానికి సంబం ధించి హైదరాబాద్ టోలి చౌకీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘ ర్షణ తీవ్ర కలకలం రేపింది. గోల్కొం డకు చెందిన షకీల్ కొంతమంది వ్యక్తులతో కలిసి టోలి చౌకీలో రి యల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవపడినట్లు తెలు స్తోంది. ఈ సమాచారం తెలియడం తో హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి బాలకృష్ణ సిబ్బం దితో అక్కడకు చేరుకున్నారు.

ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్ష ణలో కాల్పులు జరిగాయన్న సమా చారంతో అక్తర్ వద్ద ఉన్న లైసెన్సు గల తుపాకీని పోలీసులు తనిఖీ చేశారు. కాల్పులు జరిపినట్లు ఎలాంటి అధారాలు లభించలేదని పోలీస్ అధికారి బాలకృష్ణ తెలి పారు. అయితే ఇరువర్గాల్లో ఎవ రూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. అయితే జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని, దీనిని సుమోటోగా తీసుకుని ఘర్ష ణలో పాల్గొన్న వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని ఆయన తెలి పారు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.