Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hyderabad Cricket Association: అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు ఎంపిక

ప్రజా దీవెన,కోదాడ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించే అండర్ 14 టోర్నమెంట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ ఎంపికైనట్లు కోచ్ సిద్దిక్ తెలిపారు.ఈ సందర్భంగా కోచ్ సిద్ధిక్ మాట్లాడుతూ వీరు 8 నెలలుగా కోదాడ క్రికెట్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్నారు అన్నారు.

సందేశీ రిత్విక్ జయ స్కూల్ లో 9వ తరగతి,ధరవత్ ఈశ్వర్ హోల్ ఫ్యామిలీ స్కూల్ నందు 8వతరగతిచదువుతున్నారు అనితెలిపారు.వీరు ఎంపికైన సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్,కోదాడ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ డా, కొత్తపల్లి సురేష్,చందాశ్రీను,ఖజమీయ,జబ్బర్,దర్గైయ్య, సురేష్,నాయిని నాగేశ్వర్ రావు,శ్రీకాంత్,నాయిని వేంకటేశ్వర్లు,తదితరులు అభినందనలు తెలిపారు.