Hydra : ప్రజా దీవెన, హైదరాబాద్: హైడ్రా పే రు చెప్పి లావాదేవీలకు, అవకత వకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరిం చింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబ రు 3వ తేదీన హైడ్రా స్పష్టమైన ప్రక టన చేసింది. అవకతవకలు జరిగి నట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ కోరా రు. లేని పక్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ విభాగానికి, స్థాని క పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయా లని సూచించారు. అవకతవకలు నిజమైన పక్షంలో హైడ్రా ఉద్యోగులై తే సస్పెండ్ చేయడంతో పాటు కఠి న చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ప్రత్యక్షం గా కాని పరోక్షంగా కాని హైడ్రా పేరు ను వినియోగించుకుని వసూళ్లకు పాల్పడినా, అవకతవకలు చేసినా వారిపైనా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురిపై కేసులు కూ డా పెట్టామన్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తు న్నట్టు ఏవైనా ఫిర్యాదులుంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తమ దృష్టికి కాని, ఏసీబీ, విజిలె న్స్, పోలీసులకు సమాచారం ఇ వ్వాలని కోరారు. అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు.
వంశీరాం బిల్డర్లపై ఎమ్మెల్యే ఫి ర్యాదు అందలేదు… గత సం వ త్సరం 18.8.24న, 21.12.24 తేదీ ల్లో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి నుంచి హైడ్రాకు రెండు ఫిర్యాదులు అం దాయి. ఖాజాగూడలోని తౌతాని కుంటలో నీరు నిలిచిపోవడం వల్ల గ్రీన్గ్రేస్ అపార్టు మెంట్ సెల్లార్లోకి నీరు చేరుతోందనేది ఒకటి కాగా తౌతానికుంట నిండిన తర్వాత వ రద నీరు భగీరథమ్మచెరువుకు వెళ్ల డంలేదనేది రెండోది. ఈ రెండు ఫి ర్యాదులపైన కూడా నేరుగా తానే రెండు సార్లు క్షేత్ర స్థాయిలో పర్య టించి సమస్యలను తెలుసుకున్న విషయాన్ని కమిషనర్ గుర్తు చేశా రు. పైనుంచి వచ్చిన వరదను తౌ తానికుంటకు తర్వాత భగీరథమ్మ చెరువులోకి వెళ్లే అవకాశాలను పరిశీలించారు. భగీరథమ్మ చెరు వులో ఆక్రమణలు గత ఏడాది డిసెంబరు చివరి వారంలో హైడ్రా తొలగించింది. వంశీరాం మ్యాన్హ ట్టన్ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు అంద లేదు. ఈ విషయంలో వారి వద్ద ఏమైనా ఫిర్యాదు ఉంటే వాట్స ప్లో అయినా పంపితే పరిశీలి స్తాం. గతంలో ఎమ్మెల్యే వాట్సా ప్లో సమస్యను చెబితే స్పం దించాం కూడా. ప్రజాప్రతినిధుల ఫిర్యాదులకు ప్రాధన్యత ఉంటుం దన్నారు.
ఫిర్యాదు ఎవరిదైనా తక్షణ స్పందన …. ఫోన్లు వస్తే వెంటనే మాట్లాడి సమస్య తెలుసుకో వడం ఒక వేళ సమావేశాల్లో ఉన్నప్పుడు ఫోను లిఫ్ట్ చేయలేకపోయినా ఫి ర్యాదుదారులు మెసేజ్ పెడితే స్పం దించడం సర్వసాధరణంగా జరు గుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రతి సోమవా రం నిర్వహించే ప్రజావాణిలోనే కా కుండా పని దినాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ ప్రజ ల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ట్టు కమిషనర్ పేర్కొన్నారు. ఎమ్మె ల్యేల ఫిర్యాదులకే స్పందన కరువా అని అనిరుధ్రెడ్డి ఆరోపణలు చేసి నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ వివరణ ఇచ్చారు.
ఫిర్యాదులపై వెంటనే చర్య లు …ప్రజల నుంచి వచ్చిన ఫిర్యా దులపై హైడ్రా వెంటనే స్పందిస్తుం ది. నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలిం చి చర్యలు తీసుకుంటోంది. ఫిర్యా దులపై హైడ్రా వెంటనే స్పందిస్తుం దని ప్రజలు గ్రహించారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే దశాబ్దాల సమస్యల కు కూడా వెంటనే పరిష్కారం లభి స్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ఇలా హైడ్రాకు 9800ల ఫిర్యాదు లందాయి. వీటిలో చాలా వరకు పరిష్కారమయ్యాయి. ప్రతి ఫిర్యా దును పారదర్శకంగా, సాంకేతికం గా, క్షుణ్నంగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని స మస్యలు పరిష్కారానికి సమయం తీసుకోడానికి ఇవే కారణాలని హై డ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.
ఫిర్యాదులపై సమీక్ష …
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకూ నిర్వ హించే ప్రజావాణిలో హైడ్రా కమి షనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఫిర్యా దు దారుల ముందే గూగుల్ మ్యా ప్స్, శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ఆధారంగా అ ప్పటికప్పుడే సమస్యపై చర్చించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగి స్తారు. అక్కడితో ఆగకుండా ఫిర్యా దుల పరిష్కారం ఎంతవరకు వ చ్చిందనేది వారంలో రెండు రోజు లు కమిషనర్ సమీక్షిస్తారు. కొన్ని పిర్యాదులపై నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తారు.