హైడ్రా రంగనాథ్ కీలక వ్యాఖ్య, ఎప్పుడూ న్యాయందే పైచేయి
hydraranganath: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యా ప్తంగా ఆరేళ్ళ క్రితం సంచలనo సృ ష్టించిన మిర్యాలగూడ పరువు హ త్య కేసులో కీలక తీర్పు వెలువడింది. ఈ కేసులో అంతిమ తీర్పు న్యా యస్థానం వెలువరించిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది. 2018 లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో సోమ వా రం నల్లగొండ న్యాయస్థానం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. A1 గా ఉన్న ప్రధాన నిధితుడు అమృ త తండ్రి మారుతీ రావు ఆత్మ హత్యకు పాల్పడగా ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావ జ్జీవ కా రాగార శిక్ష విధించింది న్యాయస్థానం.
ఆరేళ్ళ క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తుది తీర్పు రావడంతో మరోసారి ఈ కేసు తీర్పు అందరిలోనూ తీవ్ర ఉ త్కంఠకు తెరదించుతూ తారాస్థా యి చర్చకు దారితీసింది. ఈ క్ర మం లో నేరస్థులకు శిక్ష పడటంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు, పలుకులసంఘాలు, సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అప్పటి ఎస్పీ రంగనాథ్ కు అ మృత పోన్ కాల్…. ప్రణయ్ హత్య కేసులో తీర్పు వెలువడడం తో తమకు న్యాయం జరిగిందని ప్రణయ్ కుటుంబ సభ్యులు భావి స్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ భార్య అ మృత అప్పటి నల్లగొండ ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ రంగనా థ్కు ఫోన్ చేసి తమ సంతో షా న్ని పంచుకున్నారు.ప్రణయ్ హత్య జరిగిన సమయంలో రంగనాత్ నల్లగొండ ఎస్పీగా ఉన్న విషయం తెలిసిందే. కేసు విచారణలో ఎన్నో సాంకేతిక సమస్యల తలెత్తినా చా లెంజ్ గా తీసుకొని కేసును ఛేదించారు.
తప్పు చేసిన వారికి శిక్ష ప డాలనే పట్టుదలతో ఎంతో నిజా యితీ వ్యవహరించారు. మొత్తానికి తీర్పు అనుకూలంగా వచ్చిన నేప ధ్యంలో తన భర్త మరణo పట్ల న్యాయం జరిగినందుకు ప్రణయ్ భార్య అమృత హైడ్రా కమిషనర్ రంగానాథ్కు ధన్యవాదలు తెలిపేం దుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంలో న్యాయం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుందని, న్యాయా నిదే ఆలస్యమైనా పైచేయు అవు తుందని హైడ్రా కమిషనర్ రంగ నా థ్ వ్యాఖ్యానించారు.
ప్రణయ్ సమాధి వద్ద నివాళులు…. ఇదిలా ఉండగా ఈ కే సులో తీర్పు వెలువడిన నేపథ్యం లో ప్రణయ్ తల్లిదండ్రులు ప్రణయ్ సమా ధి వద్ద నివాళులర్పించి, కన్నీ టి పర్యంతమయ్యారు. ఈ కేసు విచా రణలో సహకరించిన డీఎస్పీ, స్ధానిక పోలిసులకు ధన్యవాదాలు తెలిపారు. వంద మంది సాక్షులు, 1600 పేజీల ఛార్జ్ షీట్ తో అప్ప టి ఎస్పీ రంగనాథ్ నిందితులకు శిక్ష పడేలా నిక్కచ్చిగా వ్యవహరిం చార ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇక ఈ కేసులో మరణశి క్ష పడిన A2 నిందితుడు సుభాష్ శర్మను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. A3 నిందితుడు అస్గ ర్ అలీని గుజరాత్ సబర్మతి జైలు కు, మిగిలిన ఐదుగురు నిందితుల ను నల్లగొండ జైలుకు తరలించారు. ఇక నల్లగొండ న్యాయస్థానం తీ ర్పు పై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేం దుకు వీలుగా న్యాయమూర్తి వెసు లుబాటు కల్పించడంతో తదుపరి పరిణామక్రమంలో ఈ కేసు లో మరె లా ఉంటుందో అన్న కొంత మీమాం స కూడా ప్రస్తుతం చర్చ నీయాంశం గా మారింది.