Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ias tripati : నూరుశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నూరుశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆస్థిపన్నును నూటికి నూరు శాతం వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారు లు ఆదేశించారు. బుధవా రం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాల యంలో మున్సిపాలిటీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.అన్ని విభాగాల సిబ్బంది,వారి విధులు తెలుసుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ ద్వారా వసూలు చేసే ఆస్తి పన్నుకు సంబంధించి నూటికి నూరు శాతం వసూలు చేయాలని, ముఖ్యంగా మున్సిపాలిటీ ద్వారా ఆదాయం వచ్చే కార్యక్రమాలపై దృష్టి కేంద్రీ కరించాలని అన్నారు.

మున్సిపాల లిటీ పరిధి లో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మా ణా న్ని త్వరితగతి న పూర్తిచేయాలని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించి న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెయిడ్ లైసెన్సు లకు సంబంధించి 100 శాతాన్ని వసూలు చేయాలని అన్నారు. ము న్సిపాలిటీ ద్వారా చేపట్టిన పనులన్నీటిని త్వరితగతిన పూర్తి చేసేం దుకు ఇంజనీరింగ్ సిబ్బంది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ఆదే శించారు.

నల్గొండ మున్సిపాలిటీకి జిల్లా యంత్రాంగం తరఫున నూటి కి నూరు శాతం సహకారాన్ని అందిస్తామని ఆమె తెలిపారు. మున్సిపల్ చైర్మ న్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అ హ్మద్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ సత్యనారాయణ, మున్సిపల్ మేనేజర్ శైలజ, స్థానికత తహసిల్దర్ శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్షా సమా వేశానికి హాజరయ్యారు.

Ias tripati