ICSE schools HM : ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి హాజరైన ఐసిఎస్ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు
భవిష్యత్ విద్యను రూపొందించ డంలో జాతీయ విద్యా విధానందే కీలక పాత్ర అని సిఐఎస్సిఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కార్యదర్శి డాక్టర్ జోసెఫ్ ఇమాన్యుయెల్ అన్నారు.
జాతీయ విద్యా విధానందే కీలక పాత్ర
సిఐఎస్సిఈ కార్యదర్శి డాక్టర్ జోసెఫ్ ఇమాన్యుయెల్
ప్రజా దీవెన, హైదరాబాద్: భవిష్యత్ విద్యను రూపొందించ డంలో జాతీయ విద్యా విధానందే కీలక పాత్ర అని సిఐఎస్సిఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కార్యదర్శి డాక్టర్ జోసెఫ్ ఇమాన్యుయెల్ అన్నారు. హైదరాబాద్లోని హబ్సిగూడలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్లో సిఐఎస్సి ఈ నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిఐఈఎస్ఈ(CIESE) పాఠశాలలకు సంబంధించిన ప్రాంతీయ కార్యదర్శి శ్రీమతి యు.ఎ. సుందరి ఆయనకు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఐసిఎస్ఈ(ICSE) పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. సమగ్ర అభివృద్ధి మరియు నూతన బోధనా పద్ధతు లను ప్రోత్సహించడానికి ఎన్ఈపి- 2020 మార్గదర్శకాలను అనుసం ధానం చేయాల్సిన అవసరాన్ని జోసెఫ్ ఇమాన్యుయెల్(Joseph Emmanuel) వెల్లడిం చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి జరుగుతున్న సహకారంపై సుందరి కృషిపై తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఎన్ఈపీ- 2020ని సమర్థంగా అమలు చేయడంపై ప్రధానోపాధ్యాయులు అభిప్రాయాలను పంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు విద్యా రంగంలో ముందు వరుసలో ఉండేలా కృషి చేయాలని సంకల్పిం చారు.
ICSE schools HM attended from AP and Telangana