Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

farmer loan waiver: అన్నమాట ప్రకారం రుణమాఫీ అమలు

తెలంగాణ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేసి తీరాల ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికా రులతో అన్నారు.

పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరాల్సిందే
వెంటనే విధివిధానాలు రూపొం దించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదే శం

ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ(farmer loan waiver) చేసి తీరాల ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) అధికా రులతో అన్నారు. ఇందుకు సంబం ధించి వెంటనే విధివిధానాలు రూ పొందించాలని ఆదేశించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవ సాయ, సహకార శాఖ అధికారు లతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. రైతు రుణ మాఫీ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయా లని, పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుం చి రైతుల వివరాలు సేకరించి అర్హు లను గుర్తించాలని సూచించారు.

కటాఫ్‌ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరా లను కూడా అందుబాటులో ఉండే లా చూడాలని పేర్కొన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ (farmer loan waiver)చేసేందుకు పూర్తిస్థాయి వివరాలతోపాటు అవ సరమైన అంచనా వ్యయాన్ని కూ డా రూపొందించాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరమవుతున్నాయో చూసుకొని ఆదాయ మార్గాలను అన్వేషించాలన్నారు. మూడు, నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని, కేబినెట్‌ ముందు పెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవ సాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవ సాయశాఖ కార్యదర్శి రఘునంద న్‌రావు, డైరెక్టర్‌ గోపి ఇతర అధికా రులు పాల్గొన్నారు.

Implementation of farmer loan waiver