Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy : దేశ సంపదను ఆదాని,అంబానీలకు దోచిపెడుతున్న మోదీ

మోడీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపె డుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలవుతుంది
46 జీవోపై వచ్చే అసెంబ్లీలో కమి టీ వేసి రద్దు చేస్తాం
ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి
రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: మోడీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని (adani), అంబానీలకు(ambani) దోచిపె డుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థి (graduate mlc candidate) తీన్మార్ మల్లన్న నామినేషన్ (Nomination) సందర్భంగా శుక్రవారం నల్గొండలోని ఏచూరి గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు అధికా రంలో ఉండి చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఇచ్చిన 5 గ్యారంటీల లో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ ,కేటీఆర్ లు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ ఎన్నికల (Parliament elections) తర్వాత ఆ పార్టీ నాలుగు ముక్కల వుతుందని వ్యాఖ్యానించారు.

అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు కవిత జైలుకెళ్ళిందని, వారు కూడా జైలుకెళ్లక తప్పదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ లకు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. పట్టబద్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (tinmar mallanna) తనకున్న ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేయడం మామూలు విషయం కాదన్నారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను లక్ష మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని కోరారు. జీవో 46తో నిరుద్యో గుల కు అన్యాయం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ జీవోపై కమిటీ వేసి రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం ఇస్తే రాజకీయాలలో సమూల మార్పులు తీసుకువస్తానని స్పష్టం చేశారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో, అవినీతి సొమ్ముతో గెలుపొందాడని విమర్శించా రు. గెలిచిన తర్వాత చేతకాక నిరుద్యోగులను వంచనకు గురి చే శాడని ధ్వజమెత్తారు.

గ్రాడ్యుయేట్లంతా ఈ ఎన్నికలలో తనకు మొ దటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరా రు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న తన కుటుం బానికి ఉన్న ఒక కోటి 50 లక్ష ల రూపాయలను ప్రభుత్వానికి రాసి స్తున్నట్లు ప్రకటించారు. తనకు మద్దతునిస్తున్న రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మా రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాల్గొని ప్రసంగించగా, నల్ల గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, నల్ల గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ, ఖ మ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రస్మా సంఘం నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు.

India wealth give Adani and Ambani by modi