–గైర్హాజరైన 619 మంది విద్యార్థులు
Inter Exams :ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ప్రేరిక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్న 12 గంటల వరకు జరగనున్నాయి. బుధవారం ఉదయం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష 9 గంటలకు ప్రారంభం కావడంతో గంట ముందుగానే 8 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్ధులను 8.30 గంటల నుంచి పరీక్ష హాల్ లోకి అనుమతించారు. విద్యార్ధులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు తల్లితండ్రులు వారి వెంట వచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో 28722 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 11706 మంది, ఒకేషనల్ 2341 మంది ఉన్నారు. రెండో ఏడాది విద్యార్థులు జనరల్ 12389 మంది, ఒకేషనల్ కు 2341 మంది ఉన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
— పరీక్ష రాసిన 14066 మంది విద్యార్థులు…
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 14685 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 14066 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాశారు. మిగతా 619 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. వీరిలో జనరల్ విద్యార్థులు 403 మంది ఒకేషనల్ విద్యార్థులు 216 మంది ఉన్నారు.