Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

women’s day : ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

*నేటి బాలికలే రేపటి మహిళల అభ్యున్నతి: ఎంఈఓ

women’s day : ప్రజా దీవేన, కోదాడ: పట్టణంలోని స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీం షరీఫ్ పాల్గొని మహిళా ఉపాధ్యాయులను సిబ్బందిని పూలు,శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8న రెండవ శనివారం సెలవు దినం కావటం వలన శుక్రవారం నాడు మహిళల వేడుకలను ముందుగా నిర్వహించినట్లు తెలిపారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు .

మహిళలు కృషి పట్టుదలతో వారు ఆలోచనలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారని అన్నారు నేటి బాలికలు చైతన్యంతో ఆలోచించి చదువుకుంటే,భవిష్యత్తులో మహిళాభ్యున్నతి సాధ్యమన్నారు. మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరం సహకరించాలని కోరారు. మహిళా ఉపాధ్యాయులు మీనాక్షి, పద్మావతి, హేమలత, కళ్యాణి, రేణుక, సునీల, రాణి, పద్మ పాఠశాల సిబ్బంది విజయ, అంజమ్మ, అరుణ ను సన్మానించ కోవటం
అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ సీనియర్ ఉపాధ్యాయురాలు వి.మీనాక్షి పాల్గొని మాట్లాడినారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు