International Yoga Day : ప్రజా దీవెన నల్లగొండ టౌన్:ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ మరియు ఆచార్య అల్వాల రవి రిజిస్ట్రార్ చేతుల మీదుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ బ్రోచర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి , సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ప్రేమ్ సాగర్ మరియు యూనివర్సిటీ కామర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. శ్రీదేవి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ షరీఫ్ డాక్టర్ శేఖర్ వీరస్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.