ప్రజా దీవెన, తిరుమలగిరి: మహారాష్ట్ర నాందేడ్ నుంచి నల్లగొండ సూర్యపేట తొర్రూర్ ప్రాంతాలకు నాటు సారా తయారీ కోసం అక్రమంగా తరలిస్తున్న బెల్లా న్ని ఎక్సైజ్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీ సులు ఆదివారం పట్టుకున్నారు. నాందేడ్ నుంచి పిట్లం మెదక్ సిద్దిపేట జనగామ తిరుమలగిరి తొర్రూర్ మహబూబ్ ప్రాంతాలకు లారీలో బెల్లాన్ని తరలిస్తున్నారని సమాచారం అందుకున్న నల్లగొండ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సీఐ మల్లయ్య బృందం ఈ లారీని తిరుమలగిరి ప్రాంతంలో పట్టుకున్నారు.
లారీలో 3000 కేజీల బెల్లం 100 కేజీల ఆలం 20 లీటర్ల నాటు సారా ఉంది. ఈ బెల్లం విలువ రూ. మూడు లక్షల పదివేలుగా ఉంటుందని అంచనా వేశారు. నాటు సారా తయారీకి బెల్లం సప్లయర్గా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వినీత్ నాందేడ్ నుంచి లారీలో బెల్లాన్ని పంపించిన లారీ యజమాని, బెల్లాన్ని లారీలో తీసుకువచ్చిన లారీ డ్రైవర్ షేక్ ఫరూక్ పై కేసు నమోదు చేశారు.
బెల్లాన్ని పట్టుకున్నటువంటి టాస్క్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ నల్లగొండ శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ సంతోష్, సూర్యాపేట ఈఎస్ఆర్ లక్ష్మణ్ నాయక్ అభినందించారు.