Jajula Lingam Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశ జనాభా లో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు మొండి చేయి చూపడాన్ని నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను చించి ఓయూ లోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలియజేసారు.
ఈ సంద ర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ మొత్తం దేశ బడ్జెట్ 50,65,345 రూ.లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం 2,500 కోట్లు కేటా యించడం సిగ్గుచేటని,బిజెపి ప్రభు త్వం బీసీలను అవమానపరిచిం దని ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.60 శాతం ఉన్న బీసీలకు ఈ బడ్జెట్ తో ఒక్కో మనిషికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదన్నారు .
ప్రధానిగా బిసి ఉన్న బీసీలకు ఒరి గిందేమి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ ను సవరిం చైనా సరే బీసీలకు లక్ష కోట్లు కేటా యించాలని జాజుల డిమాండ్ చే శారు.ఈ కార్యక్రమంలోఅల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షులు నామ సైదులు, TDSF రాష్ట్ర అధ్యక్షులు విజయ్ నాయక్, ఓయూ జేఏసీ నేతలు సురేష్ నా యక్, యాకు నాయక్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.