Jajula Lingam Goud : ప్రజా దీవెన, హైదరాబాద్ : బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను,కులగణన సర్వేలో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపినందుకు బీసీ బిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ అగ్రకులాలకు ఒక న్యాయం బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఒక న్యాయం ఏవిధంగా చూస్తుంది అని ఈ సందర్భంగా అన్నారు.
అగ్రకులానికి చెందినటువంటి ఎందరో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి తిట్టిన వారేనని గాంధీభవన్ తగలబెట్టిన సందర్భాలు కూడా అగ్రకులాల నాయకులు చేశారని,వారికి ఎన్నడూ నోటీసులు ఇచ్చింది గానీ సస్పెండ్ చేయడం గాని జరగలేదని కేవలం బలహీన వర్గాలకు చెందిన వారినే టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసం.బీసీల గురించి మాట్లాడినందుకే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారని ఈ సందర్భంగా లింగంగౌడ్ కాంగ్రెస్ పార్టీపై అగ్రహా వ్యక్తం చేశారు.
వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ బీసీల అగ్రహానికి గురిగాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.