Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jampala Narasimha: శ్రీ లక్ష్మి రామకోటి గీత భక్తుడు జంపాల నరసింహ మృతి

మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 19 నాంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన శ్రీ లక్ష్మి రామకోటి గీతా యజ్ఞం ప్రచార కార్యదర్శి జంపాల నరసింహ అనారోగ్యంతో బుధవారం రోజున రాత్రి హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు జంపాల నరసింహ నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ అందరితో కలుపుగోలుగా ఉండేవారు.

తీరిక సమయాల్లో శ్రీ లక్ష్మి రామకోటి గీత యజ్ఞ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ప్రేమ అభిమానాలు పొందారు నరసింహ అకాల మరణం చెందడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది గీతా భక్తులు పార్థివ దేహాన్ని పూలమాలతో నివాళులర్పించారు