Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jishnudev Verma: గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ పదవీ స్వీకార ప్రమాణం

–ఘన స్వాగతం పలికిన సీఎం, సీఎస్‌
–శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
–సుస్థిర అభివృద్ధికి సహకరించాల ని కొత్త గవర్నర్‌ పిలుపు

Jishnudev Verma: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ (Jishnudev Verma )బాధ్యతలు చేప ట్టారు. రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలం గాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి, జస్టిస్‌ అలోక్‌ అరాధే పుష్పగుచ్ఛం ఇచ్చి శుభా కాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా గవర్నర్‌ను వెంట తీసుకెళ్లి మంత్రులు, ఇతర ప్రము ఖుల్ని పరిచయం చేశారు. పరిచ య కార్యక్రమం తర్వాత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పోలీస్‌ గౌరవ వంద నం స్వీకరించారు. సీఎం, మంత్రుల తో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఆ తర్వాత ప్రముఖులతో కలిసి గవర్న ర్‌ తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతి కుమారి, (Tri Bhatti Vikramarka, State Ministers, MLCs, MLAs, CS Shanti Kumari) గవర్నర్‌ ముఖ్య సలహాదారు బుర్రా వెంకటేశం, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు, ఉన్నతాధికా రులు హాజరయ్యారు. కాగా, ప్ర మాణ స్వీకార కార్యక్రమంలో గవ ర్నర్‌, సీఎం ధరించిన కండువాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రమాణ స్వీకారానికి ముందు జిష్ణుదేవ్‌ వర్మను రాజ్‌భవన్‌లో కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి శాలు వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. వెంటనే గవర్నర్‌ తమ సాంప్రదాయం ప్రకారం రేవంత్‌ రెడ్డికి కండువా కప్పారు. సాధారణంగా సీఎంకు ఎవరైనా శాలువా, కండువా కప్పితే భద్రతా సిబ్బంది వెంటనే తీసేస్తారు. కానీ, ఇది తమ సంప్రదాయమని గవర్నర్‌ చెప్పడం, ఆయన కూడా ధరించి ఉండటంతో సీఎం కూడా కండువా ధరించే ప్రమాణ స్వీకార కార్యక్ర మంలో పాల్గొన్నారు. గ్రూప్‌ ఫొటో లోనూ కండువాతోనే కనిపించారు. అంతకుముందు శంషాబాద్‌ అం తర్జాతీయ విమానాశ్రయలో జిష్ణు దేవ్‌ వర్మకు సీఎం రేవంత్‌ రెడ్డి స్వా గతం పలికారు. సీఎస్‌తోపాటు డీజీపీ జితేందర్‌, త్రివిద దళాల అధికారులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

డైనమిక్ సీఎం రేవంత్‌రెడ్డి..

గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిష్ణుదేవ్‌ వర్మ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. సమ్మి ళిత, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో తెలంగాణ పౌరు లంతా చేతులు కలపాలని పిలు పునిచ్చారు. ‘‘విభిన్న సంస్కృతు లు, సుసంపన్న వారసత్వం, ప్రకృతి అందాలకు నిలయం తెలంగాణ. ఇక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు దక్కింది. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయ న సారథ్యంలోని మంత్రి వర్గానికి అభినందనలు. యువత సమా జానికి గొప్ప ఆస్తి. నాణ్యమైన విద్య, ఉపాధి అకాశాలు అందించ డం వల్ల వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు’’ అని గవర్నర్‌ అన్నారు. రైతులకు రూ.2లక్షల మేర రుణాలు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం.. తనకు సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.