Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Joint Nalgonda : ఉమ్మడి నల్లగొండను ఉత్తమ జిల్లాగా నిలుపుతాం

— రు. 2వేల కోట్లతో ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో రహదారులు

— ఉగాది నుండి రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ

–సాగర్ ఆయకట్టు లో రబీ సీజన్ లో చివరిగింజ చేతికి వచ్చే వరకు నీరు అందిస్తాం

–రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమా ర్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Joint Nalgonda : ప్రజా దీవెన, సూర్యాపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ నుండి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీ దుగా హుజూర్ నగర్ పట్టణం నుం డి పంపిణి ప్రారంభిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పాలకవీడు మండలం జానపహాడ్ లోని దర్గా దర్శించుకొని డేక్కన్ సిమెంట్ అతిధి గృహం నందు రా ష్ట్ర ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా అభివృద్ధి పై చర్చించుకున్నా విషయాలను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా వివరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వేలకోట్లు ఖర్చు పెట్టి దొడ్డు రకం బియ్యం ఇవ్వటం తో వాటిని తినకుండా కోళ్ల ఫారాలకి, బీర్ల కంపెనిలకి, రీ సైకిలింగ్,కాకినాడ పోర్ట్ ద్వారా అక్రమంగా తరలించి దుర్వినియోగ పర్చారని అందుకే ప్రజల కొరకు ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినేలా సోనియాగాంధీ గారి నాయకత్వంలో ప్రవేశ పెట్టిన ఆహార భద్రత చట్టం ని పటిష్ట పరుస్తూ తెలంగాణ లోని 3.2 కోట్ల మందికి(84 శాతం) కడుపు నింపేలా ఉగాది నాడు ప్రారంభించి ఏప్రిల్ నెల నుండి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని తెలిపారు.

 

 

ఉమ్మడి జిల్లాలో అన్ని సాగునీటి ప్రాజెక్ట్ లకి ప్రాధాన్యత నిస్తూ అనుకున్న సమయానికి పూర్తి చేసి జిల్లాను సస్య శ్యామలం చేస్తాం అని తెలిపారు. ఎస్ యల్ బి సి, డిండి ప్రాజెక్ట్, నెల్లికల్లు,నాగార్జున సాగర్ ఎడుమ కాల్వ కి మరమ్మత్తులు, ఎ యమ్ ఆర్ కి మరమ్మతులు చేపిస్తామని ఇటీవలే గంధమల్ల కి క్యాబినెట్ ఆమోదం పొందామని త్వరలో పనులు ప్రారంబిస్తామని తెలిపారు.

కృష్ణ నదిలో నీటి కొరతకు కారణం గత ప్రభుత్వమే అని 512 టి యమ్ సి లు ఆంధ్రకి ఇచ్చి, 299 టి యమ్ సి లకి మాత్రమే తెలంగాణ కి వచ్చేలా ఒప్పందం చేసికున్నారని అలాగే పోతిరెడ్డిపాడు కేపాసిటి పెంచిన, ముచ్చికల్లు వద్ద డబుల్ నీళ్లు ఆంధ్ర వారు తరలించెందుకు గత ప్రభుత్వ పాలకులు సహాయం చేసారని మేము వచ్చాక క్రిష్ణ నది బోర్డు మేనేజ్ మెంట్ తో మాట్లాడుతూ తెలంగాణ వాటాని పెంచేవిదంగా పోరాడుతున్నామని తెలిపారు.శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ తయారు చేసి 5 టి యమ్ సి ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి తరలించి ఎడమ కాల్వ, ఎ యమ్ ఆర్ ద్వారా నీరు విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు రబీ సీజన్ లో వేసిన వరి ప్రతి గింజ ఇంటికి చేరేంతవరకు సాగు నీరు అందిస్తామని తెలిపారు.

 

 

తదుపరి రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 2000 కోట్లతో పలు రోడ్లు నిర్మించి ఉమ్మడి జిల్లాను అభివృద్ధి లో నెంబర్ 1 గా ఉంచుతామని వివరించారు.ఎస్ ఎల్ బి సి సొరంగం ని గతంలో వై యస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రారంభించి 30 కి మి లు పూర్తి చేశామని తదుపరి వచ్చిన ప్రభుత్వం పదేళ్లు కాళేశ్వరం పేరుతో కాలయాపన చేసి మిగిలిన ప్రాజెక్ట్ లను వదిలేసారని మా ప్రభుత్వం రాగానే యస్ యల్ బి సి సొరంగం నిర్మాణం పూర్తి చేయుటకు అమెరికా వెళ్ళి ర్యాబిస్ కంపెనీ తో చర్చించి పనులు ప్రారంభించామని,కానీ పనుల్లో సొరంగం కూలడం దురదృష్టం అని, బ్రహ్మణవెళ్ళoలకి 200 కోట్లు పదేళ్లు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచారని మేము రాగానే పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించమని తెలిపారు. సోమవారం యస్ యల్ బి సి పనులపై ముఖ్యమంత్రి గారితో సమావేశంలో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.దేవాదుల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గం లకి నీరు ఇస్తామని తెలిపారు.

1000 కోట్లతో రైల్వే బ్రిడ్జ్ లు, 140 కోట్లతో దామరచెర్ల వద్ద బ్రిడ్జి నిర్మెంచేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అనుమతి ఇచ్చారని తెలిపారు.గత పాలకులు
10 టి యమ్ సి లు నీరు జగన్ మోహన్ రెడ్డి కి తాకట్టు పెట్టి నీరు తరలించేలా సహకరించరని అన్నారు. మేము గెలిచిన అప్పుడు నుండి ఇంట్లో ఉండకుండా ప్రజల మధ్యలో ఉంటూ అభివృద్ధి, సంక్షేమం పై నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో నల్గొండ ఎంపీ రఘు వీర్ రెడ్డి,ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, బి లక్ష్మా రెడ్డి, జై వీర్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి,మందుల సా మెల్, వేముల వీరేశం, బాలు నాయక్,బీర్ల ఐలయ్య, అనిల్ కు మార్ రెడ్డి, ఎమ్మె ల్సీశంకర్ నాయ క్, మదర్ డైరీ చైర్మన్ గుత్తా అమి త్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.