నల్లగొండ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
Journalisthealthscheme ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నూతన సంవత్సరాన్ని 2025 పుర స్కరించుకొని బుధవారం సాయం త్రం నల్లగొండ ప్రెస్ క్లబ్ లో నూత న సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదే రమేష్, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు గుండగోని జయశంకర్ గౌడ్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జర్నలిస్టులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలుత నల్ల గొండ ప్రెస్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేశారు. ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో జర్నలిస్టుల సమస్త సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తామన్నారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాలు విషయంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం అందే విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సహకారంతో కృషి చేస్తున్నా మన్నా రు.
నల్గొండ పట్టణంలోని ఐకాన్ హాస్పటల్ సౌజన్యంతో ప్రతి జర్నలి స్టు కుటుంబానికి హెల్త్ కార్డు త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి దండంపెల్లి రవికు మార్, ఉపా ధ్యక్షులు అనిరెడ్డి వెంక ట్ రెడ్డి, సర్వాది జానయ్య, ప్రెస్ క్లబ్ సభ్యు లు రవిశంకర్, యాదగి రి, కత్తుల హరి, వెంకట మధు, సతీష్, రాం ప్రసాద్, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ విజయ్ తదితరులు ఫాల్గొన్నారు.