Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Journalists: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం త్వరలోనే పాలసీ

–హైదారాబాద్ జర్నలిస్టు సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాలు
–జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మూడు నెలలు పొడిగింపు
–టీయూడబ్ల్యుజే (ఐజేయూ)రాష్ట్ర తృతీయ మహసభల్లో రాష్ట్ర సమా చార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Journalists: ప్రజా దీవెన, ఖమ్మం: రాష్ట్రంలోపని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు (Journalists) ఇళ్ల స్థలాలు (houses) ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ ని తీసుకువస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించా రు. బుధవారం ఖమ్మంలో జరుగు తున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆ యన ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ( Telangana)ఉద్య మంలో జర్నలిస్టుల (Journalists) కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభు త్వ హయాంలో నాటి ముఖ్య మం త్రి కేసీఆర్ పడికట్టు పదాలతో సమ స్యలు తీరుస్తామంటూ హామీలు ఇచ్చారే గాని ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో (Hyderabad) గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సం బంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపో యాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభు త్వం ఇప్పటివరకు వారికి ఇళ్లస్థ లాలను ఇవ్వలేదని విమర్శించారు. త్వరలోనే ఆ స్థలాలను హైదరాబా ద్ (Hyderabad) జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ స భ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం, పది రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నా రని ప్రకటించారు.

అలాగే హైదరా బాద్లో (Hyderabad) మిగిలిపోయిన మిగతా జర్న లిస్టులకు, జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వర లోనే ఒక పాలసీని తీసుక వస్తున్నా మని చెప్పారు.గతంలో ఖమ్మంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబం ధించి ఇచ్చిన జీవో ఆగిపోయిందని తెలిపారు. మరొక స్థలాన్ని చూడాల ని జిల్లా కలెక్టర్ ను ఆదేశించామని ఆ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవు తుందని ప్రకటించారు. అక్రిడిటేషన్ల గడువు ఈ నెలాఖరు తో ముగుస్తు న్నదని, మరో మూడు మాసాల పాటు గడువు పెంచుతున్నామని దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి వెలువడనున్నాయని మంత్రి పేర్కొన్నారు. వందకు వంద శాతం జర్నలిస్టులకు (Journalists) ఈ ప్రభుత్వం అం డగా ఉంటుందని, హెల్త్ కార్డులకు సంబంధించి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దాని కి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం ఉన్నటువంటి అన్ని రకాల కమి టీలను త్వరలోనే పునరుద్ధ రిస్తా మని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టియుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్రప్రతినిధులు నగు నూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విర హత్ అలీ, నరేందర్ రెడ్డి, కే సత్య నారాయణ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కార్యవర్గం తది తరులు పాల్గొన్నారు.