Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Journalists : జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

Journalists : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రా బాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్న లి స్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్ర స్తు త ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డి మాండ్ చేశారు. బుధవారం నాం పల్లి లోని టీఎన్జీవో భవన్లో జరిగిన హైదరాబాద్ అడహక్ కమిటీ స భ్యుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ హైదరాబాద్ జర్నలిస్టు లకు నివాస స్థలాలు అందించే వి షయంలో ప్రభుత్వాలు అలసత్వ వైఖరిని అవలంబిస్తున్నాయని, వెం టనే ప్రస్తుత ప్రభుత్వం దీనిపై స్పం దించి నిర్ణయం తీసుకోవాలని ఆ యన కోరారు.

గత కొంతకాలంగా జర్నలిస్టుల హె ల్త్ కార్డులు కార్పొరేట్ వైద్య శాలల్లో పనిచేయటం లేదని, ఈహెచ్ఎస్ తోపాటు జెహెచ్ఎస్ కూడా అన్ని ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రిడేషన్ కార్డులను తగ్గించే దిశగా ఆలోచ నలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇదే జరుగుతే ఆందోళ న బాట తప్పదని ఆయన హెచ్చ రించారు. టీ యూ డబ్ల్యూ జే ప్రధా న కార్యదర్శి అస్కాని మారుతి సా గర్ మాట్లాడుతూ తెలంగాణ జర్న లిస్టు ఫోరం ఏర్పడి మే 31 కి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా రజతోత్సవాలు జరు పుకునే దిశగా సంఘం ఆలోచి స్తుం దని, అన్ని జిల్లా బాధ్యులకు చర్చిం చి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలి పారు. ఈ మధ్యకాలంలో చత్తీస్ ఘడ్ లాంటి రాష్ట్రంలో జర్నలిస్టు లో పెన్షన్ విధానాన్ని పెంచి మరి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని కో రారు.

కార్యక్రమంలో టి యూ డబ్ల్యూ జే రాష్ట్ర కోశాధికారి పి. యోగానంద్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్య దర్శి రమణ కుమార్, ఐజేయూ జా తీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, రాష్ట్ర నాయకురాలు కవి త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

నూతన కమిటీ : అధ్యక్షులుగా: సిహెచ్ రాకేష్ రెడ్డి,(టీవీ9) ఉపాధ్యక్షులుగా ఎం. మల్లేష్,{వార్త) వి అజయ్,(10టీవీ) సువర్ణలు, ప్రధాన కార్యదర్శిగా: ఎస్ సోమేశ్వర్,(ఆంధ్రజ్యోతి) సంయుక్త దర్శులుగా రమేష్,(నమస్తే తెలంగాణ) ఆర్ ప్రవీణ్ కుమార్,(వి6) కార్యనిర్వాహక కార్య దర్శులుగా ఎస్ వెంకట్,(నమస్తే తెలంగాణ) ఆర్ వెంకట్,( ఆంధ్ర ప్రభ) కోశాధికారిగా వి. బాపూరావు,(నమస్తే తెలంగాణ ) కార్యవర్గ సభ్యులుగా ఎస్ సంతోష్ (నమస్తే తెలంగాణ ) లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శిగా, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా నవీన్ కుమార్ యారాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ప్రకటించారు.