Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Julakanti Ranga Reddy : రాష్ట్ర సమగ్ర అభివృద్ధికై ప్రజా పోరాటాలు

–సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

Julakanti Ranga Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికై ప్రజా పో రాటాలకు పిలుపని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపు నిచ్చారు.జనవరి 25-28, సంగా రెడ్డి పట్టణంలో జరగనున్న సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల పోస్టులను నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో బుధవారం ఆ పార్టీ శ్రేణులు తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఉద్యమాల దిక్సూచి, పోరాటా ల సారధి, కష్టజీవుల గొంతుక సిపిఐ (యం). తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు. 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరగనున్నాయని పేర్కొన్నారు. 25న ప్రజాప్రదర్శన బహిరంగ సభ సంగారెడ్డి లోని పీఎస్ఆర్ గ్రౌండ్స్ లో ఉంటుందని, పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపు ని చ్చారు.రాష్ట్రంలో ఎక్కడైనాప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా అక్కడ, ఆ ప్రజల పక్షాన నికరంగా నిలబడే పోరుకెరటం సీపీఎం అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం గడిచినా ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహ రించి జిల్లాలో ఉన్న డిండి ఎత్తిపో తలు నక్కలపల్లి గండి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి సుమారు నాలుగు లక్షల ఎకరాలకు నీరు నుంచే ప్రాజెక్టుల ను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కొలువులురాక నిరుద్యోగ యువత ఎదురుచూ పులు చూస్తోంది. కూలీలు, అసంఘటితరంగ కార్మికుల బతు కులు దయనీయంగా ఉన్నాయి. కౌలు రైతులను గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. వృత్తిదా రులు సమస్యల ఊబిలో కూరుకుపోయినారు ఒక్కరేమిటి అన్ని రంగాల ప్రజలు సంక్షోభంలో ఉన్నారు.నిరంకుశంగా.పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఆరు గ్యారెంటీలు, అనేక వాగ్దానాలు నమ్మి ప్రజలుకాంగ్రెసు గెలిపిస్తే ప్రభుత్వం మారింది తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కావడంలేదు.

పేదలు తలదాచుకోడానికి జానెడు జాగా లేక అల్లాడిపోతుంటే ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేసింది సిపిఎం. నేటికీ అనేక జిల్లాల్లో పోరాడుతున్నది. భూపోరాటం నడిపింది. ప్రభుత్వ భూములను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీసింది. నిర్వాసితులకు అండగా నిలిచింది. లగచర్లలో ప్రజల పక్షాన నిలిచి విజయం సాధించింది. గిరిజనులకు వెన్నుదన్నుగా నిలిచింది. పోడు సాగుదారు హక్కు పత్రాల సాధన పోరాటంలో అగ్రభాగాన నిలిచింది. ఆదివాసీల అటవీహక్కులకై పోరాటం చేసింది. కార్మిక హక్కులరక్షణ కోసం, రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు కోసం, అందరికీ ఉచిత ఆరోగ్యాన్ని అందిం ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం, వ్యవసాయ కూలీల, అసంఘటితరంగ కార్మికుల కనీస వేతన చట్టాల అమలు కోసం, ప్రజలను సమీకరించి ఉద్యమాల సారధిగా సిపిఐఎం నిలబడింది.

ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తామని ప్రకటించి సంవత్సరకాలం పూర్తి చేసుకుంది. ఇచ్చిన హామీ ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా డిండి ప్రాజెక్టుకు డిపిఆర్ అమలు చేస్తూ పట్టించింది. సిపిఐఎం పోరాట ఫలితంగా నేడు డిండి ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతున్నాయని వెంటనే పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దిండి ప్రాజెక్టు ద్వారా మహబూబ్నగర్ రంగారెడ్డి నల్లగొండ జిల్లాల ఆయకట్టుకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టుకు డిపిఆర్ ఆమోదించడం పట్ల సిపిఐఎం హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పారు.మూసి ఆయకట్టు సుమారు 70 వేల నుంచి లక్ష ఎకరాలు ఉంటుందని ప్రభుత్వం మూసి ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులు చేస్తామని మురికిని తొలగించి మంచినీటిని అందిస్తామని ప్రకటించడం పట్ల స్వాగతిస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో విషపు నీటిని ప్రారదోలి, గోదావరి, కృష్ణ జలాలతో మూసీ నదిని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రకటించిన విధంగా డిపిఆర్ ను సిద్ధం చేసి నిధులు కేటాయించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.

సిపిఐఎం ప్రజా ఉద్యమాల అనంతరం ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను కేటాయిస్తామన్నారు. వెంటనే అర్హులైన లబ్ధిదారులకు గుర్తించి ఇళ్లను కేటాయించి లబ్ధిదారులకు ఇండ్లలోకి పంపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేద బడుగు బలహీన వర్గాలకు ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఇంటి నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ఆ దిశలో మొదటగా స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని చెబుతున్నారు, స్థలం లేని పేదల ను సైతం గుర్తించి వెంటనే స్థలాలను కేటాయించి ఇంటి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎన్నికల్లో వచ్చిన 6 గ్యారంటీ స్కీములను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

రైతు రుణమాఫీ రాష్ట్రంలో 42 లక్షల రైతులకు చేస్తామన్నారు. ఇప్పటికీ కేవలం 22 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పారు. మిగిలిన రైతులందరికీ వెంటనే నిధులు కేటాయించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 400 కోట్లు మంజూరు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఎక్కడ అమలు జరిగినట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మయా భరోసా పథకం ద్వారా భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఇప్పుడు ఉపాధి హామీలో 20 రోజులు పని చేసిన వారికే ఇస్తామని నిబంధనలు పెడుతున్నారు భూమిలేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని ఆయన కోరారు.

కేంద్రంలో మోడీ సర్కార్ నూతన ఆర్థిక విధానాలను నయా ఉదారవాద విధానాలను చాలా వేగవంతంగా అమలు చేస్తుంది కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నది అంబానీ ఆ దానిలో సర్కార్గా మోడీ సర్కార్ మారింది ఇందులో భాగమే ఆదాని లంచాల బాగోతం ప్రజల్ని ఇక్కట్ల పాలు చేస్తూ అసమానతలు పెంచుతుంది పెట్రోల్ డీజిల్ గ్యాస్ రోజువారి వాడుకునే సరుకుల ధరలు విపరీతంగా పెంచి బతకలేని దుర్భర స్థితిలోకి ప్రజలు నట్టేస్తున్నది మన మూలుగాలను పీల్చి కార్పొరేట్లు బలిసేలా చేస్తున్నది.ప్రజలను అభద్రతలోకి నెట్టివేసింది. వికసిత భారత్ అంటూ అందమైన పదాలు చెబుతూప్రజలను సమస్యల ఊబిల్లో ముంచేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు దోచి పెడుతున్నది. అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో దేశాన్ని పాలకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

మీడియానుచెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజల సమస్యలు చర్చనీయాంశం కాకుండా చేస్తున్నది. అందుకే మన సమస్యలుపరిష్కరించబడాలంటే ఉద్యమాలు, పోరాటాలే మార్గం అని అన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాసమ స్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతున్నదని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి రెండు అమలుచేసి మిగతా సమస్యల గురించి మీనమేషాలు లెక్కిస్తున్నదని విమర్శించారు రైతులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం చేస్తున్నది. ‘ఆర్థిక విధానాల్లో మాత్రం బిజేపి, కాంగ్రెస్ పార్టీలకు తేడా కనపడటంలేదు.

మతోన్మాదంపై అవకాశవాద వైఖరితో ఉంటున్నది. కేంద్ర వివక్షపై గానీ, బిజెపి విభజన రాజకీయాలపై గానీ మెతకగా. వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్ప,ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న బీజేపీ ప్రమాదాన్ని విస్మరిస్తున్నారు.విద్యార్థి, యువజన, మహిళ, వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, రైతులు, అసంఘటితరంగ కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, మహిళలు, మైనారిటీలు అన్ని రంగాల ప్రజల సమస్యలపై నిరంతరం ప్రజా ఉద్యమాలకు సారధ్యం వహించి సిపిఐ(యం) నడుపుతున్నది. ప్రజల మధ్య సామరస్యపూరిత వాతావరణాన్నిదెబ్బతీసే మతోన్మాదంపై నికరంగా పోరు సలుపుతున్నదని, లౌకిక ప్రజాస్వామ్య భారతం కోసం పాటుపడుతున్నదని అన్నారు.

ప్రజలు, ప్రజాతంత్రవాదులు, లౌకిక వాదులు, మేధావులు ప్రతి ఒక్కరు సిపిఐ(యం) పార్టీకి చేదోడుగా నిలుస్తూ లౌకిక ప్రజాస్వామిక విలువల రక్షణకు పాటుపడాలని ప్రజా ఉద్యమాలకు అండగా నిలవాలని ఆయన కోరారు. . దేశ రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలను చర్చించిరాబోయేకాలంలో నిర్వ హించబోయే ఉద్యమాలు, పోరా టాలకు ప్రణాళిక రూపొం దించుకో వడానికి రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర భవిష్యత్తు కు దిక్సూచిగా నిలవనున్న ఈ మహా సభలను జయప్రద చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో సీపీఎం రాష్ట్ర కమి టీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పాలడుగు నాగార్జున , వి వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.