–కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణలో కీలక నిర్ణయం
ప్రజాదీవెన, హైదరాబాద్:
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరంపై కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ఆరా తీస్తోంది. ఈ మేరకు పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాళేశ్వరంపై మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని కోరింది. కేబినెట్ తీర్మానాల మేరకే నిర్ణయాలు జరిగాయని కమిషన్ విచారణ లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, నాటి మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కేబినెట్ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కమిషన్ కోరింది. అయితే కాళేశ్వరంకు కేబినెట్ ఆమోదం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం గత ప్రభుత్వ కేబినెట్ తీర్మానాల రికార్డులను ప్రభుత్వం కమిషన్కు పంపించనుంది. కాగా కాళేశ్వరం ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మం త్రులు హరీష్, ఈటలను కమిషన్ విచారించిన విషయం తెలిసిందే.
కేబినెట్ ఆమోదంతో అన్ని నిర్ణ యాలు తీసుకున్నామని కేసీఆర్, హరీష్రావు, ఈటల చెప్పడంతో కమిషన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఆనాటి మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 13న నీటిపారు దలశాఖకు కూడా లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం మంత్రుల సమావేశంలో చర్చించారు. అంతేకాదు కమిషన్కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు.