కాళోజీ కుమారుడు కన్నుమూత
ప్రజా దీవెన/ హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవికుమార్(68) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. హన్మకొండ జిల్లా దామెర సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచారు.
కాళోజీ నారాయణరావుకు ఏకైక సంతానమైన రవికుమార్ ఆంధ్రా బ్యాంకులో క్లర్క్గా పని చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. కొద్దికాలంగా అనారోగ్యతో గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.