Kampati Sandeep : ప్రజా దీవెన,కోదాడ: హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన కంపాటి సందీప్ మాదిగ ను సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శిగా నియమించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పాడిశాల రఘు. బంక వెంకటరత్నం జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి నాగరాజు లు సందీప్ కు నియామక పత్రాలు అందజేశారు అనంతరం సందీప్ మాట్లాడుతూ.
ఫిబ్రవరి 7వ తారీకు హైదరాబాదులో జరిగే వేల గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ ,నాయకులకు ధన్యవాదాలు తెలిపారు జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరినీ కలుపుకొని జిల్లాలో ఎంజిఎఫ్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ జర్నలిస్టులు పాల్గొన్నారు.