Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Karnati Parvathamma: భూమి దాత మాజీ సర్పంచ్ సతీమణి. కర్నాటి పార్వతమ్మ కన్నుమూత

మూడు తరాలకు ఆదర్శంగా నిలిచిన మహిళ
నివాళులర్పించిన నాంపల్లి పట్టణ ప్రజలు

మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 26 నాంపల్లి పట్టణం మాజీ సర్పంచ్ స్వాతంత్ర సమరయోధులు భూమి దాత. కర్నాటి రామచంద్రం కర్ణాటి పార్వతమ్మ అనారోగ్యంతో బుధవారం రోజున కన్నుమూశారు. ఆమె మరణ విషయాలు తెలుసుకున్న పట్టణ ప్రజలు ప్రార్ధివ దేహానికి నివాళులర్పించారు పార్వతమ్మ మూడు తరాల ప్రజలకు ఆదర్శవాదిగా నిలిచారని నూరు సంవత్సరాలు జీవించి కుటుంబంలో మెలగవలసిన తీరును బాధ్యతలను గుర్తు చేసేవారని వ్యవసాయంపై మక్కువ ఉండేదని తన కుమారులను ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా మంచి స్థాయిలో ఉండేటట్లు విద్యను అందించారని పట్టణ ప్రజలు ఆజ్ఞాపకాలను గుర్తు చేశారు.

నాంపల్లి మండల కేంద్రంలో మండల అభివృద్ధి కార్యాలయం అద్దె భవనాలలో ఉండడం చూసి ఆమె చలించి తన సొంతంగా ఉన్న రెండు ఎకరాల భూమిని కార్యాలయం భవన నిర్మాణమునకు తన కుమారులను ఒప్పించి ప్రభుత్వానికి దానంగా అప్ప చెప్పింది తన పర్యవేక్షణలో భవన నిర్మాణానికి కృషిచేసన ఘనత దక్కిందని మండల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు తన కుమారుడు బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ పూలమాలని వేసి నివాళులర్పించారు,