Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Karnati Suresh: అంబేద్కర్ కృషి అజరామరం

*అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్*
*కర్నాటి సురేష్*..

భారతరత్న, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని న్యాయవాది, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ అన్నారు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కర్నాటి సురేష్ న్యాయవాది కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధన కోసం బిజెపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వారి కోసం ప్రయత్నం చేసిందని అన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేశారని, రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ గారిని, మూడవసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేయడం అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకు బిజెపి చేస్తున్న కృషిని తెలియజేస్తుందని అన్నారు… ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య, జెల్ద భాస్కర్, నారాయణదాసు చండీశ్వర్, సొనగంటి రవి ప్రసాద్,గంజి హరి, బొడ్డు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు