Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mlc KAVITHA: లిక్కర్ కేసుల్లో కవితకు బెయిల్

–కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
–ఈడీ కేసులో 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్న కవిత

Mlc KAVITHA: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యాప్తం గా సంచ లనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం (The Liquor Scandal) కేసులో జైలులో ఉన్న కవితకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సు ప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ (BR Gavai, Justice Viswa nathan)తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా, ఈడీ తర పున ఏఎస్పీ వాదనలు విని పించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్సీ కవిత (brs mlc kavitha) బెయిల్‌ పిటిషన్‌పై మంగ ళవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టి స్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా కవిత తరఫున ప్రము ఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాద నలు విని పించారు. కవితకు బెయి ల్‌ పొందే అర్హత ఉందని తెలిపారు.

ఇప్ప‌టికే కవిత బెయిల్‌ (BAIL)పిటిషన్‌పై వాదనలు ముగిశాయని రోహత్గీ తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్త య్యిందని న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలి పారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని, సీబీఐ కేసు లో 4 నెలలుగా జైలు లో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. కేసులో ఛార్జ్‌షీట్లు (charge sheet) కూడా దాఖలు చేశా రని తెలిపారు. కవి త దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గీ అన్నారు.

కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉం దని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు.దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చ డంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్‌ గ్రూప్‌ (South Group )100 కోట్లు అంటున్నార ని, కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపా రు. 493 మంది సాక్షులను విచారించారని అన్నారు. సాక్షులను బెది రించారని చెబుతున్నారని కానీ ఎక్కడా ఎందుకు కేసులు నమో దు కాలేదని ప్రశ్నించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.

విచారణలో తీవ్ర ఆలస్యం జరుగు తుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు.దీనిపై ఈ డీ న్యాయ‌వాది ఎస్వీ రాజు త‌న వాద‌న‌ను వినిపిస్తూ, కవిత దర్యా ప్తుకు సహకరించడం లేద‌న్నారు.అయితే నేరం జరిగింది అనడానికి ఆధారం ఏముందని ను అడిగింది ధర్మాసనం  కవితను రెండేళ్లుగా వాడిన మొబైల్ ఫోన్లను (mobil phone) అడిగామ‌ని, కవిత వాటిని ఇచ్చార‌ని తెలి పారు. అయితే మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేసారా డేటా డిలీట్ చే సారా అని అడిగామ‌ని, అందుకు క‌విత త‌న‌కు తెలీదు అన్న సమా ధానాలు ఇచ్చార‌న్నారు న్యాయ‌వాది.

ఈడీ కవి తను అడిగిన ప్రశ్నలు, కవిత ఇచ్చి న సమాధానాలను కోర్టుకు తెలిపిన ఎస్వీ రాజుకవిత సమాజ సేవలో ఉన్నారని, విద్యా ర్హతలు సమాజం లో వారి కుటుంబానికి గుర్తింపు ఉం ద‌న్న సుప్రీం కోర్టు వ్యాఖ్యాల‌కు అ డ్డుప‌డిన న్యాయ‌వాది వ్యక్తి గత హోదాను బెట్టి బెయిల్ మంజూరు చేయ‌డం కుద‌ర‌ద‌న్నారు.కైమ్ డేటా రికార్డులో (Chime data record) నిందితులతో జరిపిన చాటింగ్స్ ఉన్నాయని ప్ర‌స్తా వించా రు.బుచ్చిబాబు ,అభిషేక్ బోయిన పల్లితో జరిపిన చాట్స్ గురించి తన కు తెలియదని కవిత చెప్పార‌న్నా రు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రా రెడ్డి నుంచి నిధులను సమకూర్చి కవిత ఆప్ కి అందజే శార‌ని వాదించారు. ఢిల్లీలో కేజ్రీ వాల్ (Kejriwal) ను కలిసిన తరువాత మాగుం ట శ్రీనివాసులు రెడ్డి వెళ్లి కవితను కలిశార‌న్నారు. కేసులో కవిత పాత్ర గురించి మా గుంట శ్రీనివాసులు రెడ్డి, కేజ్రీవాల్ తదితరులు చెప్పిన అంశాల గు రించి వివరించారు. దీని పై ముకుల్‌ రోహత్గీ కౌంట‌ర్ ఇస్తూ, కవిత ఎవరినీ బెదిరించలేదని స్ప ష్టం చేశారు.విచారణలో తీవ్ర ఆల స్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు (manish sisodia)  ఇచ్చిన బెయిల్ అం శాలే కవితకు వర్తిస్తాయని తెలిపా రు. ఇప్ప‌టికే విచార‌ణ పూర్తి కావ‌డం తో బెయిల్ ఇవ్వాల్సిందేన‌ని ముకుల్ ధ‌ర్మా స‌నాన్ని కోరారు. ఇరు వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం రెండు కేసుల‌లో ష‌ర‌తుల‌తో కూడిన బె య‌ల్ మంజూరు చేయడం గమనార్హం.