Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kavitha: కవితకు ‘ సుప్రీం’ షాక్..!

–బెయిల్ మంజూరులో మరోసారి చుక్కెదురు
–గడిచిన ఐదు నెలలుగా తీహార్ జైల్లోనే కవిత
–నైరాష్ట్యంలో యావత్ కెసిఆర్ కుటుంబం

Kavitha:ప్రజాదీవెన, ఢిల్లీ: కవిత (Kavitha) బెయిల్ ప్రాసెస్‌‌లో ఉందని వచ్చే వారంలో బెయిల్ వస్తుందని కేటీఆర్ అంచనాలు తలకిందులు అయ్యాయి. సుప్రీంకోర్టు బెయిల్ (Supreme Court Bail)మంజూరు చేయలేదు. సీబీఐ, ఈడీ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తామని వాటికి నోటీసులు జారీ చేసింది. మార్చి పదిహేనో తేదీ నుంచి జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ క‌విత‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చేందుకు జ‌స్టిస్ గ‌వాయి, జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ ధ‌ర్మాస‌నం నిరాక‌రించింది.

కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదనలు

ఎమ్మెల్సీ క‌విత త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ (Senior Advocate Mukul Rohatgi) వాద‌న‌లు వినిపించారు. 5 నెల‌లుగా క‌విత జైల్లో ఉన్నారని.. ఓ ప్ర‌జాప్రతినిధిగా, మ‌హిళ అయిన క‌విత‌ను ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారు అంటూ రోహ‌త్గీ దర్యాప్తు సంస్థల తీరును ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్ప‌టికే మ‌నీష్ సిసోడియా, కేజ్రీవాల్ బెయిల్ పొందా రని కవిత కూడా బెయిల్‌కు అర్హురాలేనన్నారు. కేసు పెట్టిన ఈడీ, సీబీఐల‌కు తాము నోటీసులు జారీ చేస్తామ‌ని జ‌స్టిస్ గ‌వాయి చెప్పారు.

దర్యాప్తు సంస్థల వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం
అయితే మ‌ధ్యంత‌ర బెయిల్ అయినా ఇవ్వండి అని క‌విత లాయ‌ర్ రోహ‌త్గీ (Senior Advocate Mukul Rohatgi) ధ‌ర్మాస‌నానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు జ‌స్టిస్ గవాయి నిరాక‌రించారు. దర్యాప్తు సంస్థల అభిప్రాయాల‌ను వెల్ల‌డించిన త‌ర్వాతే వాద‌న‌లు వింటామ‌ని అప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌లేమ‌న్నారు.త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోపు అఫిడ‌విట్ ఫైల్ చేయాల‌ని ఈడీ, సీబీఐల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ వారంలో బెయిల్ వస్తుందనుకున్న కేటీఆర్
కవిత ఆరోగ్యం బాగోలేదని మెడికల్ గ్రౌండ్స్ (Medical grounds) మీద అయినా బెయిల్ మంజూరు చేస్తారని బీఆర్ఎస్ (BRS) వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే పిటిషన్ దాఖలు చేసిన వెంటనే దర్యాప్తు సంస్థల వాదనలు వినకుండా బెయిల్(bail) మంజూరు చచేేయడం కష్టం. అందుకే.. మధ్యంతర బెయిల్ కోసం కవిత లాయర్ పట్టుబట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కవిత మరో పదిరోజుల పాటు జైల్లో ఉండాల్సింది. ఒక వేశ దర్యాప్తు సంస్థలు కవితపై మరీ కఠిన వైఖరి కాకుండా కాస్త సాఫ్ట్ గా వ్యవహరిస్తే ఆమెకు బెయిల్ లభించే అవకాశం ఉంది.

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ( Sisodia) బెయిల్ లభించింది. ఆయన పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది కానీ.. సీబీఐ కేసులో లభించలేదు. ఆ బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. అప్రూవర్లుగా మారిన వారంతా బెయిల్ పొందారు. కానీ కవిత మాత్రం..దాదాపుగా ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు.