Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kazha Alta Hussain : పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు పాఠ్యాంశాలు అవసరం

–ఉపకులపతి ఆచార్య కాజా అల్తా హుస్సేన్

Kazha Alta Hussain : ప్రజా దీవెన నల్లగొండ టౌన్:
మహాత్మా గాంధీ విశ్వవిద్యాల యం రసాయన శాస్త్ర విభాగం మరియు ఎంఎస్ఎన్ లాబరేటరీస్ బిజినెస్ చైర్ ఆధ్వర్యంలో “ఫార్మా రంగంలో నవీన రీతులు” అంశంపై ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహించారు. “ఎం ఎస్ ఎన్ బిజినెస్ చైర్” చైర్పర్సన్ ఆచార్య ఎం వసంత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉపకులపతి ఆచా ర్య కాజా అల్తాఫ్ మరియు నాట్కో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ శైలేంద్ర దలాల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మరియు సమాజ హితమైన సిలబస్ అవసరమని గుర్తు చేశారు.

సమస్యలను సవాళ్లుగా స్వీకరించి వాటి పరిష్కారాల దిశగా అభ్యసనం సాగించి విజయం పొందాలని సూచించారు. అనంతరం నాట్కో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ శైలేంద్ర దలాల్ ” ఆవిష్కరణలు సుస్థిరత్వం, ఉత్పత్తుల సామర్థ్యం – అంశాల్లో రాబోవు తరం ఫార్మా విద్యార్థుల సాధికారత అంశంపై ప్రసంగించారు. విద్యార్థులు ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని, ప్రభుత్వాల సూచనలు అంతర్జాతీయ సూచనల మేర భారీ ఔషధాల ఉత్పత్తి నాణ్యతలపై దృష్టి సారించి అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. ఎం ఎస్ ఎన్ గ్రూప్ ప్రతినిధులు డా లక్ష్మీరెడ్డి, హెచ్ఆర్ -లక్ష్మీనరసింహ మూర్తి వెబ్ టైడ్ సింథసిస్ వ్యాధుల నివారణపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా కె ప్రేమ్సాగర్, విభాగ అధిపతి డా రూప, బి ఓ ఎస్. డా.దోమల రమేష్, డా వై ప్రశాంతి, ఆచార్య అన్నపూర్ణ, డా కళ్యాణి, డా జ్యోతి, శ్రీధర్ రావు, తిరుపతి, శంకరాచారి, అభిలాష అమరేందర్, భువన తదితరులు పాల్గొన్నారు.