Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR : కొనఊపిరి వరకు కొట్లాడతా

తన కంఠంలో కొన ఊపిరి ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటానని, కేసులకు జైళ్ళకు భయపడే ప్రసక్తే ఉండబోదని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉద్ఘాటించారు.

రాష్ట్ర ప్రజల కోసం రాజీలేని పోరాటం
అరెస్టులు, జైళ్లకు భయపడే ప్రసక్తే ఉండబోదు
పది గంటలు కరెంట్‌ కట్ పోయిందంటే పరిపాలన అర్థమవుతోంది
అంతర్జాతీయంగా మహానగరo ప్రతిష్ఠకు మసక
రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్ల ఈ దుస్థితి దాపురించింది
ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: తన కంఠంలో కొన ఊపిరి ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటానని, కేసులకు జైళ్ళకు భయపడే ప్రసక్తే ఉండబోదని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్(kcr) ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పేగులు తెగే దాక కొట్లాడే పార్టీ బీఆర్‌ఎస్‌ అని, 12 మంది తమ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్‌లో(Parliament) రాష్ట్ర హక్కుల గురిం చి కొట్లాడుతారని, నిధులు తీసుకొ స్తారని పేర్కొన్నారు.అనేకానేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఆగం చేస్తే సహించ బోనని కేసీఆర్‌ హెచ్చరించారు.

మల్కాజిగిరి బీఆర్‌ ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా బుధ వారం హైరాబాద్‌ శివారు దుండిగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు చౌరస్తా వద్ద, మెద క్‌ అభ్యర్థి వెంకట్రామ్‌ రెడ్డి గెలుపు కాంక్షిస్తూ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, పటాన్‌చెరులలో నిర్వహించిన రోడ్‌ షోల్లో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ను మేం పవర్‌ ఐలాం డ్‌గా మార్చామని, రెప్పపాటు కూ డా కరెంట్‌ పోకుండా చేశామని, నిన్న కొద్దిపాటి వాన పడితే ఆరు నుంచి పది గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందoటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏవిధంగా ఉం దో అర్థం చేసుకోవచ్చని సూచించా రు.

ఇలాంటి పరిస్థితితోనే అంత ర్జాతీయ స్థాయి కలిగినమహానగరo ప్రతిష్ఠపోతుందని పరిశ్రమలు వెళ్లిపోతాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్ల అంతర్జా తీయంగా హైదరాబాద్‌ ఇమేజ్‌ తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయని, బీఆర్‌ఎస్‌ అధి కారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాం డంగా తాగునీటి సరఫరా చేశా మని, ఇప్పుడు నీటి సరఫరా ఎందు కు తగ్గిందని, నీటి ట్యాంకర్లు ఎందు కు తిరుగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏనాడూ హైదరాబాద్‌, హెచ్‌ఎండీఏ(HMDA) పరిధిలో రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారం పడిపోలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పడిపోయాయని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగిపోయిందని, ఐటీ రంగం కుదేలైందని ఆరోపించారు.

ఇందంతా సీఎం రేవంత్‌రెడ్డి చలవే అని అన్నారు. చదరపు గజానికి రూ.75 రూపాయలు సీఎంకు కప్పం కడితేనే హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే ఐదునెలలుగా అనుమతు లు నిలిపివేశారని ఆరోపించారు. నిర్మాణ రంగ సంస్థల నుంచి చదర పు అడుగుకు ఇంత అని ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేసి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి(Delhi) కప్పం కడుతున్నారని స్వ యంగా ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తనను తిట్టుడు తప్ప మరో పని సీఎంకు చేతకావడం లేదని విమర్శించారు. తన చెడ్డీ సైతం గుంజుకుంటా అని అన్నారని, అది ఏం చేసుకుంటారో తనకు అర్థం కావడం లేదన్నారు. వరినాట్లు పడకముందే రైతు బంధు ఇవ్వాల్సి ఉండగా, కోతలయ్యాక కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చి న హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్కటీ అమలు చేయడంలేదని విమర్శిం చారు.

KCR fight for telangana