KCR support modi: మోదీకి కేసిఆర్ మోకరిల్లారు
బిఆర్ఎస్ ను బీజేపీని తాకట్టు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ స్వయం గా బలిదానం చేసుకుందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ను బిజెపి కి తాకట్టు పెట్టి నాయకులను బలిచ్చారు
ఎనిమిది స్థానాల్లో విజయం కోసం బీజేపీకి కారు చేతికిచ్చారు
లోక్ సభ ఎన్నికలలో మరోసారి కుమ్మక్కైన కమలం, కారు
ఆరు నెలల తమ పాలనను ప్రజలు మెచ్చి 8 సీట్లిచ్చారు
లోక్ సభ ఫలితాల తర్వాత మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: బిఆర్ఎస్ (BRS)ను బీజేపీని(BJP) తాకట్టు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ స్వయం గా బలిదానం చేసుకుందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth reddy) పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోదీకి కేసిఆర్ మోకరిల్లి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులను బలిచ్చారని వ్యాఖ్యా నించారు. లోక్ సభ ఎన్నికల ఫలి తాల తర్వాత ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లా డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నచ్చి లోక్సభ ఎన్నికల్లో(Lok sabha elections) ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేసి ఎనిమిది స్థానాల్లో విజయాన్ని చేకూర్చారని, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గుండు సున్నా కట్టబెట్టారన్నారు. కనీసం రాష్ట్ర అవతరణ వేడుకలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదని విమర్శిం చారు. కుటుంబం స్వార్థం, పార్టీ మనుగడ, ఆస్తులు కాపాడుకునేం దుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా అతని వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రలతో కాంగ్రెస్ మిగతా 8 చోట్ల ఓడిపో యిందని వెల్లడించారు. కేసీఆర్ రాజకీయ జూదగాడని, కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు ఉంటాయ న్నారు.
ఎన్నికల్లో ఇక ఇండియా కూట మిదే జోరు… కాంగ్రెస్ పార్టీకి (Congress party)అండగా నిలిచిన అందరికీ ఈ సందర్బంగా సీఎం అభినందనలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి ఇండి యా కూటమే ప్రత్యామ్నాయమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగిందన్నారు. రాహు ల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశంలో పరిస్థితి మారిందన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. కాంగ్రెస్ పాలన నచ్చితేనే ఓటు వేయాలని ప్రజలను కోరామని సీఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వందరోజుల్లో గ్యారంటీల ను అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీ కి సంతోషకరమైన ఫలితాలు వచ్చా యన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41శాతం ఓట్లు వచ్చాయ న్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 8 సీట్లు అధికం గా ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారన్నా రు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి సమానంగా పోటీ పడిందని పేర్కొన్నారు.
KCR indirect support BJP in Telangana