–హైకోర్టులో ముగిసైన వాదనలు
KCR:ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హైకో ర్టులో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్ (Electricity Commission) ఏర్పాటు జీవోను కొట్టివే యా లని మాజీ సీఎం కేసీఆ ర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి (Justice L Narasimha Reddy) జారీ చేసిన నోటీసులు రద్దు చేయా లని పిటిషన్లో కోర్టును కోరారు. కాగా విద్యుత్ కమిషన్ చైర్మన్ ఏక పక్ష ధోరణితో వ్యవహరిం చలేదని ఏజీ పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగిశాయి. అనంతరం కేసీఆర్ పిటిషన్ (KCR Petition) పై తీ ర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు తెలి పింది.విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం విద్యుత్తు కొను గోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృ త్వంలో విచారణ సంఘం ఏర్పాటు ను సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు నంబర్ కేటాయిం చాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు (HIGH COURT)రిజస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది.
విద్యుత్తు వ్యవహారాలపై (Electrical Affairs)రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది. కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ (Petition in KCR High Court) దాఖలు చేశారు. విద్యుత్తుశాఖ ముఖ్య కార్యదర్శిని, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ సంఘాన్ని, వ్యక్తిగత హోదాలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఇందులో ప్రతివాదులుగా పేరొన్నారు.అభ్యంతరం తెలిపిన రిజిస్ట్రీ..అయితే.. జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అదిత్య సోంధి బలంగా వాదనలు వినిపించారు. ఆయనతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్కు నంబర్ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్ అభియోగాలు మోపిన నేపథ్యంలో, పిటిషన్పై నేడు వాదనలు పూర్తికాగా, తీర్పును రిజర్వ్ (RESERVE)చేసింది ధర్మాసనం ..