Kharif rice:ప్రజా దీవెన, కోదాడ: ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ వరి సాగు (Cultivation of Kharif rice)పనులు ప్రారంభం అయ్యాయి. ప్రతి రైతు ఒక అర ఎకరంల లేదా ఒక మడి లో ప్రకృతి వ్యవసాయం మీ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం పండించుకోవాలని వ్యవసాయ జర్నలిస్ట్ సిరి ఫౌండేషన్ చైర్మన్ (Journalist Siri Foundation Chairman) . మొలుగురి గోపయ్య రైతులకు పిలుపునిచ్చారు ముఖ్యంగా నారు మడిలో ఎలాంటి రసాయన మందులు వాడకుండా సహజ సిద్ద పద్ధతులు పాటించండి. నారు మడి రెండు సార్లు దున్నిన తర్వాత భూమిపై వేప ఆకులు (Neem leaves) చల్లాలి. ఆ ఆకులను ఆరు నుండి ఏడు రోజులు కుళ్ళనివ్వాలి తెలిపారు. లేదా నాలుగు కిలోల వేప గింజల పిండి దమ్ములో చల్లాలి. అవకాశం ఉంటే తొలి దుక్కిలో జిల్లేడు, సీతఫలం, వెంపలి తదితర ఆకులను కలిపి దున్నుకోవాలని లేదా 20 కిలోల ఘన జీవామృతం ఆఖరి దుక్కిలో వేయండి.దీంతో నారుకు సహజ రక్షణ లభిస్తుంది.
నారు మడిలో పురుగులు, తెగుళ్ల యాజమాన్యం
పచ్చ దీపపు పురుగులు, ఆకు చుట్టు పురుగు, గోధుమ రంగు ఆకుమచ్చ, అగ్గి తెగులు నారు మొక్కలను (Green lamprey, leaf roll, brown leaf spot, fire rot of fiber plants) ఆశిస్తాయి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వీటి నివారణకు లీటరు నీటికి 2 మిల్లీ లీటర్లు ఆవు మూత్రం ద్రావణం వారం రోజుల వ్యవదిలో రెండు సార్లు పిచికారీ చేసినట్లయితే పంటలు వేపుగా పండుతాయని రైతులంతా జాగ్రత్తలు పాటించి పంటలు ఎక్కువ దిగుబడి పొందాలని తెలిపారు