Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kiran Kumar Reddy: రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం

–ట్రిపుల్ ఆర్ మొత్తం ఖర్చే రూ.7 వేల కోట్లు
–కేటీఆర్ ఆరోపణల్లో నిజం లేదు
— భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో రేవం త్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అ య్యారని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చే రూ. 7 వేల కోట్లు అని, అలాంట ప్పుడు అందులో రూ. 12 వేల కోట్ల అవినీ తి జరిగిందని కేటీఆర్ మాట్లాడడం ఏమిటని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయ న మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ ను అరెస్టు భయం వెంటా డుతున్నదని ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈ రేసుపై కేటీఆర్ రోజు కో మాట మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

కేటీఆర్ తప్పు చేయకపోతే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసి రారు. ప్రతిపక్షం లేకుండా చేయాల నే ఆలోచన కాంగ్రెస్ కు లేద న్నా రు. ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతి పక్షం హెచ్చరించాలని, కానీ రాజ కీయం కోసం మాట్లాడటం కరెక్ట్ కాదని తెలిపారు. కేటీఆర్, కవిత, హరీశ్ లు ప్రభుత్వంపై తప్పుడు వి మర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రైతు బంధు పథకం కింద అనర్హులను లబ్దిదారులుగా చేర్చా రని ఆరోపించారు. దానివల్ల రూ.22 వేల కోట్ల అవినీతి జరిగిం దన్నారు.