Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy: అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పబ్బం

–అబద్దాలతో పార్లమెంటు సమా వేశాలను అడ్డుకుంటుంది
–వారి నోటితోనే దాని నిజస్వరూ పం బయటపడుతుంది
–కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ధ్వజం

Kishan Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్ : ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయట పడుతుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య క్షుడు జి.కిషన్ రెడ్డి (Kishan Reddy)వ్యాఖ్యానించారు. లోక్ సభ జరగకుండా అడ్డుపడటం రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress)వ్యవహరిం చేందుకు సిద్ధమైందని అన్నారు. ఈ విష యాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఆదివారం సోమాజి గూడ జయగార్డెన్ లో జరిగిన సికింద్రా బాద్ సెంట్రల్ జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ 100 కూడా సాధిం చలేదని కాని, రాహుల్ గాంధీ ప్రధా నమంత్రి అయినట్లు ఊహాగానాల్లో తేలి పోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజ కీయాల్లో మొదటిసారిగా చూస్తు న్నామన్నారు.

ఎన్నికల్లో ఓడిపో యిన అసహనంతో పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర పతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోప ణలతో విషం చిమ్మారని విమర్శిం చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలలో (elections)ప్రచారం చేసుకోవచ్చని, కానీ దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాపకింద నీరులా వ్యాపిం చి, ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరే కంగా అనేక కుతంత్రా లు, తప్పుడు ప్రచారాలు చేశాయన్నారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించ డమే వారి ఉద్దేశమన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాం గాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ (Congress party) తప్పుడు ప్రచారం చేసిందని గుర్తు చేశారు. అంబేద్కర్ అనేక సార్లు అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. జమ్ము కశ్మీర్ లో దేశ వ్యతిరేక శక్తులను పెంచిపోషించేం దుకు వీలుగా ఉన్న ఆర్టికల్ 370 ని తొలగించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి, బడుగు, బలహీన వర్గాలకు, మహిళ లకు హక్కులు కల్పించిన ఘనత ప్రధాని మోదీదేని చెప్పారు. సికింద్రాబాద్ స్థానంలో మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయని విమ ర్శించారు. ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరి గిపోతుందనే దేశ ప్రజలు కాంగ్రెస్ ను మరోసారి అధి కారానికి దూరంగా పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ లో బాంబు పేలుళ్లతో ప్రజలు వణికిపోయిన సంగతి మరువరాదన్నారు. సిద్ధాం తపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వా మ్యయుతంగా నడుచుకు నే పార్టీ బీజేపీ ఒక్కటేన న్నారు. మజ్లిస్ స్నేహం చేయడంలో బీఆరెస్, కాంగ్రె స్ పోటీ పడుతు న్నాయని దుయ్యబట్టారు.