ముఖ్య అతిథిగా హాజరైన ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 25. భారతదేశ సర్వమత సమ్మేళనం అని ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు అన్నారు నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ పాఠశాలలో మంగళవారం రోజున క్రిస్మస్ వేడుకలు పాల్గొని ఘనంగా నిర్వహించారు శాంతా క్లాజ్ వేషధారణలో కేకులు కట్ చేసి విద్యార్థులకు మిఠాయిలు పంచ రు. అనంతరం కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాల ప్రజలు ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉంటారని అందుకే ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని మరియు భారతీయులను గౌరవిస్తారని అన్నారు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం విద్యార్థులకు వివరించారు దేవుని స్మరిస్తూ ప్రేమని పంచడం ద్వారా శాంతి సోదర భావం పెంపొందుతుందన్నారు.
ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గాన్ని మానవులు అనుసరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్లు కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు చిలుకూరి రామేశ్వరి ఉపాధ్యాయులు గాదే పాక రవీందర్ పాఠశాల సిబ్బంది, ఆయాలు నాంపల్లి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు