Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Raj Gopal Reddy: తారతమ్యం భేదం లేనిదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ స్కూల్స్

–ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన మునుగోడు: మునుగోడు నియోజకవర్గం మును గోడు మండలం కల్వకుంట్ల గ్రామం లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణానికి మునుగోడు శాసనసభ్యులు కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాప న చేశారు. శంకుస్థాపన కార్యక్రమా నికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి (Komati Reddy Raj Gopal Reddy)అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (Komati Reddy Raj Gopal Reddy) మాట్లా డుతూ ఇది స్కూల్ కాదని, దేవా లయం అని పేర్కొన్నారు. మండ లానికి ఆరు పాఠశాలల చొప్పున 50 పాఠశాలలు కట్టించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అభివృ ద్ధి విషయంలో తెలంగాణ మొత్తం వచ్చి మునుగోడు ను చూసి వెళ్లా లి, మునుగోడు నియోజకవర్గంలో విద్యా వైద్య విషయంలో నిర్లక్ష్యం జరిగిందని, దానిని సరి చేయాల్సి న బాధ్యత నాతోపాటు మీ అందరి పైన ఉందని అన్నారు.

తెలంగాణ మొత్తం మాట్లాడుకుంటున్నారు 119 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బెల్ట్ షాపులు మూ సి వేయలేదని మునుగోడు ఎమ్మె ల్యే (mla) తప్ప అని గుర్తు చేశారు. మీ గ్రామాల అభివృద్ధి జరగాలంటే విద్య వైద్యం వికసించాలంటే ప్రజలందరూ బెల్ట్ షాపుల విష యంలో కఠినంగా వ్యవహరిం చాలని కోరారు. గతంలో కులమ త బేధాలు లేకుండా అందరూ ఒకే చోట చదువుకున్నాం మళ్లీ ఇప్పు డు అదే పద్ధతిలో ఈ కొత్త స్కూల్స్ ప్రారంభిస్తున్నామన్నారు. కులమ త బేధాలు తారతమ్యాలు హెచ్చు తగ్గులు గొప్ప పేద లాంటివి ఏవి ఉండకుండా చేయాలి అంటే ఇటు వంటి స్కూల్స్ రావాలని అన్నారు.

కులం లేదు మతం లేదు మనమం తా ఒక్కటే మానవత్వం తో ముం దుకు వెళ్లాలని ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy), ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క (batti vikramakra) లకు స్కూలు మంజూరు చేసినందుకు మును గోడు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. మును గోడు ప్రజలకు రావలసిన హక్కుల విషయంలో నిధుల విషయంలో అభివృద్ధి విషయంలో ఏ త్యాగాని కైనా ఏ పోరాటానికైనా సిద్ధమే రాజీ పడేది లేదన్నారు. 2018లో అతిరథ మహారదులు ఓడిపో యినప్పటికీ మునుగోడు ప్రజలు నన్ను గెలిపించారని గుర్తు చేశారు.

మునుగోడు అభివృద్ధి కోసం అసెం బ్లీలో (aseembly) అహర్నిశలు కొట్లాడిన, నా రాజీనామాతో ప్రభుత్వాన్ని మును గోడు ప్రజల కాల దగ్గరికి తీసుకొస్తే 600 కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్నారు. మునుగోడు అభి వృద్ధి కోసం రాత్రింబవళ్లు ఆలోచన చేస్తున్నానని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్య వైద్యాన్ని ప్రైవేటు పాలు చేసిందని, కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిం దని, జిల్లా మంత్రులు ఉత్తమ్ కు మార్ రెడ్డి సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రాజెక్టుల విష యంలో అభివృద్ధిలో రాజీ పడడం లేదన్నారు.

త్వరలోనే ఎస్ ఎల్ బి సి (nlbc)సొరంగ మార్గం బ్రాహ్మణ వెల్లం ల శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తు న్నారని, టిఆర్ఎస్ 10 సంవ త్సరాల కాలంలో నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగిందని అన్నారు. అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లడుతూ ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే నే గగనం అనే ఈ కుగ్రామానికి ఒక గొప్ప పాఠశాలను తీసుకురావడం అంత సులువు కాదన్నారు.నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మాకు ఈ స్కూలు మంజూర అయిందన్న విషయం తెలియదన్నారు. విద్య ద్వారా మేము ఈ సీట్లో కూర్చున్నా ము, విద్య ద్వారానే సమాజం ముందుకు వెళుతుందన్నారు. రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇక్కడ లభిస్తుందన్నారు.