–త్వరితగతిన మునుగోడు ఆధుని క బస్ స్టాండ్స్ నిర్మాణం
–మరో 10 కొత్త బస్సు రూట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
–ఆర్టీసీ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Komati Reddy Raj Gopal Reddy : ప్రజా దీవెన మునుగోడు: గత ప్రభుత్వంలో ప్రజా రవాణా వ్యవస్థ పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరచాలని మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు లోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాల యంలో శుక్రవారం ఆర్టీసీ అధికా రులతో ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికే ఆరు కొత్త బస్సు లను తీసుకొచ్చామని, ఇంకా మరికొన్ని రోడ్లలో బస్సులు నడపాలని సూచించారు. పెరుగుతున్న జనా భాకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధం గా మునుగోడు నియోజకవర్గ కేం ద్రంతో పాటు, చండూరు నాంపల్లి మండల కేంద్రాలలో ఆధునిక బస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని వాటికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు కళకళలా డుతున్నాయని, నియోజకవర్గంలో 2 ఎక్సప్రెస్ రూట్లను నడపాలని తెలిపారు. నల్గొండ నుండి మును గోడు నారాయణపురం చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ కు, నల్గొండ నుండి కనగల్, చండూరు, మర్రి గూడెం మాల్ మీదుగా హైదరాబా ద్ వరకు ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడపాలన్నారు. పాత రోడ్ల ను పునరుద్ధరించాలని దాంట్లో భాగం గా నాంపల్లి చండూరు మునుగోడు నార్కెట్పల్లి వరకు బస్సులను నడపాలన్నారు.మొదటి ప్రాధాన్య తగా రెండు ఎక్స్ప్రెస్ రూట్లు, నాం పల్లి నుండి నార్కట్పల్లి రూట్ లలో త్వరలోనే బస్సులు నడుపుతామ ని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చా రు. ఈ సమావేశంలో నల్గొండ ఆర్టీసీ రీజియన్ ఆర్ఎం కే జాన్ రెడ్డి, నల్గొండ డిపో మేనేజర్ శ్రీనాథ్, ఆర్టీసీ డిప్యూటీ అంజ య్యలు పాల్గొన్నారు.