–కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 300 హెల్మెట్లను పంపిణీ చేసిన రాజ్ గోపాల్ రెడ్డి
Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన మునుగోడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసమంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్న సంద ర్భంగా మునుగోడు నియో జకవర్గ కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహ న బైక్ ర్యాలీని నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ, స్థానిక నాయ కులతో కలిసి వాహనదారులకు 300 హెల్మెట్లను ఉచితంగా పంపి ణీ చేశారు. మునుగోడు లోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం నుండి హెల్మెట్ ధరించి మును గోడు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
మునుగోడు పట్టణంలో హెల్మెంట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారు లను ఆపి తానే స్వయంగా హెలి మెంట్ తొడిగారు. ప్రమాదాల బారి న పడి యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేద వ్యక్తం చేశారు.ఉపాధి నిమిత్తం మునుగోడు పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో చాలా జాగ్రత్తగా ప్రయాణం సాగేలా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్క వాహనదారున్ని కోరారు. రాబోయే రోజుల్లో రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపడతా మని పేర్కొన్నారు.