–రోడ్లు మరియు భవనాలు అధికా రుల సమీక్షలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి
Komati Reddy Raja Gopal Reddy: ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో ఈ నాలుగు సంవత్సరాలలో నిర్మించే రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలని మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి అన్నారు. మునుగోడు లోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో రోడ్ల నిర్మాణం పై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం టెండ ర్ ప్రాసెస్లో ఎన్ని రోడ్లు ఉన్నా యన్నారు.
పనులు జరుగుతున్న రోడ్ల సంఖ్య ఎంత… భవిష్యత్తులో ఇంకా ఎన్ని రోడ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి రోడ్డు నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిం చారు. గత పది సంవత్సరాలుగా నిర్వహణకు నోచుకోని రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో నిర్మించే రోడ్లకు డ్రైనేజీ, ఫుట్ పాత్, స్పీడ్ బ్రేకర్స్, సూచిక బోర్డులు ఉండేలా చూడాలన్నారు. ప్రతి రోడ్డు నిర్మాణంలో ప్రమాదపు మలుపులను తీసేసి వీలైనంత భద్రతతో కూడిన నాణ్యమైన రోడ్లను నిర్మాణం చేయాలని ఆదేశించారు. ప్రజలకు రోడ్డు భద్రత చాలా ముఖ్యమని సూచిస్తూ అధికారులతో మాట్లాడి రోడ్డు భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ప్రజలకు సౌకర్యవం తంగా ఉండేలా రోడ్డు నిర్మాణాలు జరగాలని మునుగోడు నియోజ కవర్గంలో నిర్మించే రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలని ఆకాక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నల్లగొండ ఆర్ అండ్ బి ఎస్ ఈ వెంకటేశ్వరరావు, ఈ ఈ శ్రీధర్ రెడ్డి, డి ఈ సుధాకర్ రెడ్డి, మునుగోడు ఏఈ శిరీష్, నాంపల్లి ఏఈ వికాస్ లు పాల్గొన్నారు