Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Rajagopal Reddy: రైతులకు పరిహారం సత్వరమే చెల్లించాలి

–అధికారులతో సమీక్షా సమావేశం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komati Reddy Rajagopal Reddy: ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో పరిధిలోని శివన్న గూడెం, కిష్టరాయనిపల్లి సాగునీటి ప్రాజెక్టుల (Irrigation projects) కింద భూ నిర్వాసితులకు సత్వరమే పరిహా రం అందేలా చర్యలు తీసుకోవా లని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy)అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాలలో మిస్సయిన ఇండ్లు, భూములు ఉంటే వాటిని కూడా నోటిఫై చేసి భూసేకరణ (Land Acquisition) చేయకుండా మిగిలి పోయిన భూములను సర్వే చేసి ఆ భూములు కలిగిన రైతులకు కూడా నష్టపరిహారం అందేలా చూడాలని ఆదేశించారు.

శనివారం మునుగో డు లోని క్యాంపు కార్యాలయం లో శివన్నగూడెం, కిష్టరాయనిపల్లి సాగునీటి ప్రాజెక్ట్ ల పై అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించా రు. చండూరు ఆర్డీవో (rdo), దేవరకొండ ఆర్డీవోలతో ఆయన సనావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్టుల కింద ముంపు గురవుతు న్న గ్రామాలలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ పరిహారం విషయాల పై అధికారులకు పలు సూచనలు చేశారు. భూ సేకరణ స్ట్రక్చర్ వ్యాల్యూను రి సర్వే చేయాలని అన్నా రు. శివన్నగూడెం ప్రాజెక్టు కింద ముంపు గురవుతున్న నర్సిరెడ్డి గూడెం, చర్లగూడెం వెంకెపల్లి, వెంకేపల్లి తండాలతో పాటు కిష్టరాయిని పల్లి ప్రాజెక్టు కింద ముంపుకు గుర వుతున్న లక్ష్మణపురం, ఈదుల గండి గ్రామాలలో హౌస్ స్ట్రక్చర్ రీవాల్యుయేషన్ (Land Acquisition) చేయాలని, ఈ హౌస్ స్ట్రక్చర్ రివాల్యుయేషన్ లో ఆర్అండ్ బి అధికారులతో సమ న్వయం చేసుకుంటూ రీవాల్యు యే షన్ చేయాలనీ సూచించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువకుల వయసుకు సంబంధించి కటాఫ్ డేట్ (Cut off date) పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.