Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: వరద బాధితులను తక్షణం ఆదుకుంటాం

–రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, ఖమ్మం: మూడు రోజు లుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, అనం తర పరిస్థితులపై సోమవారం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సహ చర మంత్రులతో కలిసి సూర్యా పేట, ఖమ్మం జిల్లాల్లో (Suryapet and Khammam districts) పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) వర ద బాధితులను తక్షణమే ఆదు కుంటామని ప్రకటించారు.భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులతోపాటు, ఇండ్లు కోల్పోయిన పేదలు, ఇతర బాధితులకు అండగా ఉంటామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు.

అధికారుల నివేదిక ప్రకారం సూర్యాపేట (Suryapet) జిల్లాలో 11 రోడ్లు తేగిపోయాయని వాటన్నిటికి మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించడం జరిగిందని, ప్రాథమిక నివేదిక ప్రకారం ఆర్ అండ్ బి రహదారుల మరమ్మతుకు 23 కోట్ల రూపాయలు అవసరమవుతాయ ని, వర్షాలు తగ్గిన వెంటనే రహదా రుల రిపేర్లను చేపడతామని చెప్పారు. తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు (farmers) రెండు లక్షల రూపాయల రుణ మాఫీని (Loan waiver)చేయడం జరిగిందని, వరదలు వలన పంటలు నష్టపో యిన రైతులకు పంట నష్టపరి హారం ఇస్తామని తెలిపారు. ఆర్ అండ్ బి రహదారులతో పాటు, పంచాయతీ రోడ్లను పునరుద్ధరిస్తా మని, అధికారులు, ప్రజాప్రతిని ధులు కలిసి పేదలకు, రైతులకు అండగా నిలబడాలని, అధికారు లు ఎవరు సెలవు పై వెళ్లకుండా 24 గంటలు పని చేయాలని ఆయన కోరారు.