— రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన నల్లగొండ: మహి ళల ను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.స్వయం సహా యక మహిళ సంఘాల సభ్యుల ద్వారా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యా లయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహి ళా శక్తి క్యాంటీన్ ను శనివారం ఆయన ప్రారంభించారు. మహిళల ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికసాధికారత సాధిం చినప్పుడే వారితో పాటు, కుటుం బాలు అభివృద్ధి చెందుతాయని అ న్నారు.
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో ముం దుంటున్నారని, ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా లో స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మహి ళలకు ఆర్థిక సహాయం అందించ డం ద్వారా మహిళా స్వయం సహా యక సంఘాల సభ్యుల ద్వారా మహిళ శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు, ఇందిరమ్మ ఇండ్లు ఇతర పథకాలు కూడా మహిళలకు అందజేస్తున్నదని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ పక్కనే 36 కోట్ల రూపాయలతో అదనపు బ్లాక్ లు నిర్మిస్తున్నామని చెప్పారు. మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలాన్నింటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబాలకు తోడ్పాటు అందించాలని పిలుపు నిచ్చారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, డి ఆర్ డి ఏ శేఖర్ రెడ్డి, అడిషనల్ పిడి శారద, తదితరులు కార్య క్రమంలో పాల్గొన్నారు.