Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy : అథమస్థాయికి దిగజారిన ప్రతి పక్షాల రాజకీయాలు

–రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు అథమస్థాయికి దిగజారి రాజకీయా లు చేస్తున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ప్రజలు డిపాజిట్లు కోల్పో యేలా ఓడించినా సిగ్గులేకుండా ప్ర జల్ని భయందోళనలకు గురిచేసే లా తప్పుడు ప్రచారాలు చేస్తున్నా రని దుయ్యబట్టారు. గతంలోనే తిరుమలగిరి, సూర్యపేట రహదారి లో మీ భూములు పోయాయి, ఫ్లై ఓవర్ తో మళ్లీ భూములు కోల్పో తారని ప్రతిపక్షపార్టీలు ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లా డారు. అర్వపల్లి –దానంచెర్ల వెళ్లే రహదారిపై అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ వస్తుందని, మీ భూములు పోతా యని లేనిపోని అపోహలు సృష్టిస్తు న్నారని సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వపల్లి సర్కిల్ దగ్గర దగ్గర ప్రమాదాల నివారణకు జంక్షన్ ఇంప్రూవ్ మెంట్ వర్క్స్ చేయడంలో భాగం గా సర్వే జరుగుతుంది తప్పితే ప్రత్యేకంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరగడం లేదని స్పష్టం చేశారు.

 

జంక్షన్ ఇంప్రూవ్ మెంట్ పనుల వల్ల ప్రజలది ఒక్క ఇంచు భూమి కూడా పోదని, ఇందులో ఎటువం టి అపోహలకు తావులేదని సూ చించారు. తెలంగాణకు సంబం ధించిన గౌరెల్లి-భద్రాచలం రహదారి గానీ, పెద్దఅంబర్ పేట్, రామోజీ ఫిల్మ్ సిటీ, బాట సింగారం ఫ్లైఓవర్లు కట్టించడం జరిగిందన్నారు.

 

 

 

ఎన్.హెచ్-65 ఆరు లేన్లుగా విస్తరిం చే పనులను వచ్చే మూడు నెలల్లో పనులు ప్రారంభించి, 18 నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటా మని, ప్రమాద రహిత రహదారిగా మార్చి, 2 గంటల్లో విజయవాడకు చేరేలా రోడ్డును అభివృద్ధి చేస్తా మని వివరించారు. 161.518 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి 7104.06 కోట్ల రూపాయలతో 5 ప్యాకేజీలు గా విభజించి టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖున టెండర్లు ఓపెన్ చేసి ప నులు ప్రారంభిస్తామని తెలి పారు. దక్షిణ భాగం డీపీఆర్ కోసం ఇప్ప టికే టెండర్లు పిలవడం జరిగింద న్నారు. నల్గొండ జిల్లా వెలిమినేడు వద్ద ఒక డ్రైపోర్టును నిర్మించాలని ముఖ్యమంత్రితో చర్చించి నిర్మలా సీతారామన్ కు లేఖ రాయడం జరిగిందని చెప్పారు. బందర్ పోర్ట్, కాకినాడ పోర్ట్ నుంచి గుండ్రాంపల్లి దగ్గర వెలిమినేడు వద్ద డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తు న్నామన్నారు. గుండ్రాంపల్లి దగ్గర నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉండటం వల్ల తెలంగాణ వ్యాప్తంగా సరుకు రవాణాకు సులు వుగా ఉంటుందని ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.2009 లో మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రమం త్రిగా ఉన్నటువంటి స్వర్గీయ జైపా ల్ రెడ్డితో మాట్లాడి 4 లైన్ల రహదా రిగా విస్తరించడం జరిగిందన్నారు.

 

అప్పుడు కాంట్రాక్టు తీసుకున్న జీఎ మ్మార్ సంస్థ 2022 నాటికి 6 లైన్లు గా విస్తరించేలా పనులు చేయాలని నిబంధన ఉన్నప్పటికి రాష్ట్ర విభజ న వల్ల నష్టపోయామని ఆర్బిట్రేషన్ కు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు.నేను స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అనేకసార్లు కలిసి 6 లేన్లు విస్తరించే పనులు మొదలు పెట్టేలా ఒత్తిడి తీసుకురావడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల ను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ప్రజ లకు ఇబ్బందులు రాకుండా రహ దారులను ప్రణాళికబద్ధంగా అమ లు చేస్తున్నామని చెప్పారు.