Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్గొండ రూరల్:రాములబండ గ్రామంలో తాడిచెట్టుపై నుండి కింద తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన చామకూరి వెంకన్న గౌడ్ మృతదేహానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అతి చిన్న వయసులో వెంకన్న గౌడ్ మృతి చెందడం బాధాకరమైన విషయం అని మంత్రి విచారం వ్యక్తం చేశారు, మృతుడి యొక్క కుటుంబాన్ని అండగా ఉంటానని భరోసా ఇచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మృతుని సోదరుడు శంకర్ గౌడ్ ను ఓదార్చి మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామంలో వేల మంది చామకూరు వెంకన్న గౌడ్ బందు మిత్రుల,అభిమానుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు..