Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: ఆ అర్హత బీఆర్ఎస్ కు ఎక్కడిది..!

–ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ విగ్రహా విష్కరణకు రావాల్సిందే
— రోడ్లు భవనాలు శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: ఏడాది కాంగ్రెస్ పాలనపై చార్జ్ సీట్ వేసేంత నైతికత బీఆర్ఎస్ కు లేదని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్ప డగానే దళితుడినే సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి అవి చేయలేకపోయిన కేసీఆర్ పై అప్పుడు ఎందుకు చార్ట్ట్ వేయలే దని మండిపడ్డారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలం గాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాట్లను ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యద ర్శి వికాస్ రాజ్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్ విడుదల చేసిన నేపథ్యం లో ఘాటుగా స్పందించారు. తెలం గాణ కోసం శ్రీకాంతాచారి చావునో ట్లో తలపెట్టి చనిపోయాడని, మరి కేసీఆర్ ఎలా బయటపడ్డారో ప్రజల కు తెలుసన్నారు. హరీశ్, కేటీఆర్లది రాజకీయ ఉనికి కోసం చేసే ఆరాట మే తప్ప వారిది నిజమైన ప్రతిపక్ష పాత్రకాదని చెప్పారు. సోమవారం నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహా విష్కరణ కార్యక్రమానికి హాజరుకా వాలని అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వా నించామని తెలిపారు.

తెలంగాణ, తెలంగాణతల్లిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి వస్తారని, తెలంగాణ అంటే ఇష్టం లేనివారు రారని అన్నారు. నిజ మైన తెలంగాణవాదులెవరో తెలిసే వేదిక ఇదేనని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఇరువైపులా ఏర్పా టు చేస్తున్న వేదికలకు సం బంధిం చి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. సచివాలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బం దులు లేకుండా చూసుకోవాల న్నారు.