Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: పురుషులతో సమానంగా మహిళలు అప్పుడే సమాజం అభివృద్ధి

–ట్రాన్స్ జెండర్ల అభివృద్ధి కోసo ఉ పాధి శిక్షణ
–రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, చిట్యాల: పురు షులతో సమానంగా మహిళలు చదువుకున్నప్పుడే సమాజం అభి వృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నా రు. సోమవారం ఆయన సల్గొండ (nalgonda) జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “బేటీ బచావో దేటి పదాదో” కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా హాజరయ్యాను బాలికలు చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని, అందువల్ల ఐడపిల్లలను, మహిళలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రత్యేకించి బాలికలకు, మహిళలకు కల్పించాల్చిన హక్కులను వారు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. చదువుతోపాటు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నల్గొండ జిల్లాలో పూర్వపు కలెక్టర్ (collector) ప్రస్తుతం ఆర్ అండ్ బి శాఖ సెక్రెటరీ (R&B Department Secretary) దాసరి హరిచందన ట్రాన్స్ జెండర్ల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి కల్పించే నిమిత్తం వారికి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేసేందుకు చర్యలు తీసుకోవడం అభినంద నీయమని అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఎస్పీజీ రెడ్డి తన స్వంత నిధులు సుమారు 30 నుండి 40 లక్షల రూపాయల స్యయంలో హెూటల్ నిర్మాణం చేసి ఆ హెూటల్లో ట్రాన్స్ జెండర్లు పనిచేసేందుకు అవకాశం కల్పించడం సంతోషమని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్ జెండర్స్ అందరికీ వారు స్వయం ఉపాధి పొంది వారి కాళ్ళ పై వారు నిలబడేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి నల్గొండ జిల్లా లో శిక్షణ పొందిన ట్రాన్స్ జెండర్స్ (Transgenders)కు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించడమే కాకుండా. వాటిని అందజేశారు. ట్రాన్స్ జెండర్లకు (Transgenders) స్వయం ఉపాధిలో భాగంగా పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను సైతం అప్పజెస్తామని తెలిపారు. బ్రాన్సెండర్లను అందరితో సమానం గా చూడాలని, వారి హెల్త్ విషయం లో సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఎంపీ చానల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళకు వారి హక్కుల పట్ల విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని బన్నారు. ట్రాన్సజెండర్ల (Transgenders)సంక్షేమంలో భాగంగా ఢిల్లీలో సైతం తన వంతు కృషిని చేస్తానని తెలిపారు. ఆర్ అండ్ బి సెక్రటరీ దాసరిహరిచందన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో తాను కలెక్టర్ గా పని చేసిన సమ యంలో అనేక మంది ట్రాన్స్ జెం డర్స్ భిక్షాటన చేస్తూ ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు టీక ఇబ్బందులు పడేవారని, వారి కాళ్ళ మీద వారు నిలబడేలా స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి శిక్షణు కార్యక్రమాలను ఇప్పించడం జరిగిందని తెలిపారు, వారిక్ మహిళా శక్తి క్యాంటీన్లు, ఇతర స్వయం ఉపాధి పనులను అప్పగిస్తే ఆర్థికంగా వారు పైకి ఎదుగుతారని, భిక్షాటన చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

మహిళలు (womans) వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా వారు ఉపయోగించిన సానిటరీ నాప్కిన్లను ఎక్కడపడితే అక్కడ పదవేయకుండా ఎలా వాడాలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 179 మంది ట్రాన్మెండర్లు ఉండగా, వారిలో 110 మందికి శిక్షణ ఇన్ని స్వయం ఉపాధి చర్యలు తీసుకోవడం సంతోషమని, వారికి ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇచ్చి (ప్రైవేటు, ప్రభుత్వ సెక్టార్లలో ఉపాధి కల్పించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు. సరిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ శిశు సంరక్షణ అందరి బాధ్యతని, ప్రత్యేకించి బాలికలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉండని అన్నారు. ఈ కార్యక్రమంలో బసిడిఎస్ సుహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి సక్కుబాయి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి ఎస్పీజీ రెడ్డి (Venkat Reddy SPG Reddy)తదితరులు పాల్గొన్నారు.