Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddybrothers : సామాజిక సేవకు బ్రాండ్ అంబాసిడర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్

--నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరే శం, మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తు ల లక్ష్మారెడ్డి --నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్న మెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే లు

సామాజిక సేవకు బ్రాండ్ అంబాసిడర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్

–నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరే శం, మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తు ల లక్ష్మారెడ్డి
–నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్న మెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

ప్రజా దీవెన, నల్లగొండ: పేదలకు, చదువుకునే విద్యార్థులకు సహా యం చేయడంలో కోమటిరెడ్డి బ్ర దర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలి చారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు అన్నారు, ఆదివారం ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న నల్లగొండ ప్రీమియర్ లీగ్ సీజన్-5 క్రికెట్ టోర్నమెంట్ కు వారు ముఖ్య అతిథి గా హాజరై నల్గొండ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద లకు, పేద విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుంటారని అన్నా రు. జిల్లా అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తనయుడు ప్రతీక్ రెడ్డిని కోల్పోయిన తర్వాత ఎంతో మంది పేద విద్యార్థుల చ దువుకు సహకారం అందిస్తూ వారిలో తన కొడుకుని చూసుకుం టు న్నాడని అన్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి మనసున్న మహోన్నత వ్యక్తులని కొనియా డారు.

పేద విద్యార్థుల ఉన్నత విద్య కు, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అనేక సామాజిక సేవా కార్య క్రమాలు చేపడుతూ సేవకు మారు పేరుగా ని ల్చారని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వారు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో మంది పేదలకు, పేద విద్యార్థులకు ఎంత గానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఎంబిబిఎస్ విద్యార్థు లతో పాటు ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం అందించడంలో వారిదిగొప్ప వ్యక్తిత్వం అని అన్నారు. పేదలకు సహా యం అందించడంలో వారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉందని తెలిపారు.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లా డుతూ క్రీడలు మానసిక ఉల్లాసా నికి, దేహ దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతా యని అన్నారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తూ క్రీడాకారులకు అండగా నిలుస్తున్నాడని అన్నారు.

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడు తూమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి క్రీడలను ప్రోత్సహి స్తూ క్రీడాకారులకు అండగా నిలుస్తున్నా డని అన్నారు. ప్రతీక్ ఫౌండే షన్ ద్వారా చదువుకునే ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక చే యుతనందిస్తున్నాడని పేర్కొన్నారు.కాగా ,ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ జట్లు రావడంతో విశేష స్పందన లభించింది.

నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ మాజీ జడ్పిటిసి వంగూరి లక్ష్మ య్య, కౌన్సిలర్లు, క్రికెట్ ఆర్గ నైజర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆంగోతు ప్రదీప్ నాయక్, బోనగిరి ప్రభాకర్, ముత్తి నేని నాగేశ్వరరావు, జూల కంటి శ్రీ నివాస్, ఆలకుంట్ల మోహన్ బా బు,బొజ్జ శంకర్, ఇంతియా జ్, బోగ రి ఆనంద్, ఏర్పుల రవి, ఆమేద్, చిన్నాల జానయ్య, మధు సూదన్ రెడ్డి, పున్న గణేష్, ఎడ్ల శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, కత్తుల కోటి, జూ లకంటి సైదిరెడ్డి, నాళ్ల వెంకటే శ్వర్లు, పారేపల్లి శ్రీనివాస్, ఏడుదొడ్ల వెంకట్రామిరెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, పిల్లి రమేష్ యా దవ్, ముత్తినేని శ్యామ్,ఎండి ఖలీల్, నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి, గుండగోని సాయి, వజ్జ రమేష్, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, పేర్ల ఈశ్వర్, మహమ్మద్, కంచర్ల ఆనంద్ రెడ్డి, పాదం అనిల్, ఏర్పు ల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Komatireddybrothers