–చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధా న అర్చకులు సీఎస్. రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్
KTR : ప్రజా దీవెన, హైదరాబాద్: ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్ను ప్రదర్శించేందుకు బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కు మార్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కు మార్, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి లతో కలి సి ఆయన అర్చకుడు రంగరాజన్ ను పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో రెండు రోజుల క్రితం కొందరు సీఎస్. రంగరాజన్ గారిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గ మైన చర్య అని కేటీఆర్ మండిప డ్డారు.రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి ఈ దాడి సంఘటన నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి చేసిన వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ ఎజెండాతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టినా, వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంద ని కేటీఆర్ స్పష్టం చేశారు. భగవం తుని సేవలో నిమగ్నమైన రంగరా జన్ కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యా ప్తంగా లక్షలాది మంది భక్తులు ఉ న్నారని, స్వామివారి సేవలో నిమ గ్నమైన కుటుంబాన్ని అవమానించ డం అంటే అది దేవుడినే అవమా నించినట్టేనని, కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నింది తులందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, రంగరాజన్ కుటుం బ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటన లు పునరావృతం కాకుండా పక డ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రంగరాజన్ కుటుంబ స భ్యులకు తాము పూర్తిస్థాయిలో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.